కూల్ ఫ్యామిలీ మూవీస్ తీయడంలో ఎంత పేరున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక అభిప్రాయం ఉంది. బ్రహ్మోత్సవం ఫలితం తేడా రాకపోయి ఉంటే ఇంకొన్ని కుటుంబ చిత్రాలు వచ్చేవి కానీ దాని డిజాస్టర్ దెబ్బకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. రీమేక్ అయినా నారప్పని డీల్ చేసిన తీరు అడ్డాలని సీరియస్ జానర్ వైపు తీసుకొచ్చింది. నిన్న ప్రకటించిన పెద కాపు సినిమా మీద ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒక సామజిక వర్గాన్ని నేరుగా ప్రతిబింబించేలా టైటిల్స్ పెట్టడం గతంలో జరగలేదు. ఇదో ట్రెండ్ గా మారొచ్చనే అంచనాలున్నాయి.
పెద కాపు మొత్తం మూడు భాగాలుగా వస్తుందట. దీనికి అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ ని మోడల్ గా తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. భిన్న కులవర్గాల పోరులో అగ్ర వర్ణాలు సామాన్యుల మధ్య జరిగే పోరు ఎలాంటి మాఫియాలకు గూండాయిజంలకు దారి తీస్తుందో అందులో అద్భుతంగా చూపించారు. మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ నటన పీక్స్ లో కనిపిస్తుంది. వసేపూర్ ఫస్ట్ పార్ట్ ఆ తర్వాత సీక్వెల్ రెండింటికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కల్ట్ స్టేటస్ దక్కింది. అయితే పెద కాపు మూడు భాగాలు అంటే సుమారు ఏడున్నర గంటలకు పైగానే నిడివి ఉంటుంది.
ఒక వెబ్ సిరీస్ కు సరిపడే కంటెంట్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించబోవడం ఒకరకంగా సాహసమే. అందులోనూ కొత్త హీరో. అఖండ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి దీని మీద పెద్ద బడ్జెట్ పెడుతున్నారు. సహజంగా స్లో నెరేషన్ ఫాలో అయ్యే శ్రీకాంత్ అడ్డాల పెద కాపు విషయంలో మాత్రం కొంత స్పీడ్ ని పాటించాల్సి ఉంటుంది. మరీ నెమ్మదిగా చెప్పినా ఇబ్బందే. కొత్త కుర్రాడు విరాట్ కర్ణ లుక్స్ బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా టీజర్ లాంటివేమీ రాలేదు కాబట్టి యాక్టింగ్ గురించి ఒక అంచనాకు రాలేం. ఇంత ఇంటెన్స్ డ్రామాకు సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ని ఎంచుకోవడం విశేషం.
This post was last modified on June 3, 2023 11:13 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…