టాలీవుడ్లో మరో పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. మామూలుగా పెద్ద కుటుంబాల నుంచి ఒక హీరో అరంగేట్రం చేస్తుంటే ఉండే హడావుడి ఆ హీరో విషయంలో కనిపించడం లేదు. ఆ కుర్రాడు దగ్గుబాటి కుటుంబానికి చెందిన అభిరామ్ అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. మిగతా కుటుంబాలతో పోలిస్తే దగ్గుబాటి ఫ్యామిలీ మామూలుగానే హడావుడికి దూరంగా ఉంటుంది.
రానా లాంచింగ్ కూడా కొంచెం సింపుల్గానే జరిగింది. అతణ్ని మాస్ హీరోను చేసేయాలన్న ఆలోచనేమీ సురేష్ బాబులో కనిపించలేదు. రానా తనకు తానుగా భిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలు చేసి మంచి పేరు సంపాదించాడు. అభిరామ్ను సైతం మిగతా వారసుల తరహాలో మాస్ హీరోను చేయాలని చూడకుండా.. సీనియర్ దర్శకుడు తేజతో ‘అహింస’ సినిమాలో సగటు కుర్రాడి పాత్రలో లాంచ్ చేయిస్తున్నారు.
ఈ సినిమా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం కావడం.. ప్రోమోలు మరీ గొప్పగా ఏమీ అనిపించకపోవడంతో బజ్ తక్కువగానే ఉంది. ప్రోమోల్లో అసలు అభిరామ్ను ఎక్కువగా ఎలివేట్ చేయడానికి కూడా చూడలేదు. ముందే అంచనాలు పెంచకుండా.. కంటెంట్తో, తన పెర్ఫామెన్స్తో మెప్పించాలన్న ప్రయత్నం వల్ల కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఐతే బాక్సాఫీస్ దగ్గర ‘అహింస’కు అనుకూల పరిస్థితులే ఉన్నాయి.
గత కొన్ని వారాల్లో వచ్చిన సినిమాల్లో ఏవీ ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపట్లేదు. ‘అహింస’కు పోటీగా రిలీజవుతున్న ‘నేను స్టూడెంట్ సార్’, ‘పరేషాన్’ చిత్రాలకు బజ్ తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో టాక్ బాగుంటే ‘అహింస’నే ఈ వారం బాక్సాఫీస్ లీడర్ కావచ్చు. మరి సరైన ఫామ్లో లేని తేజ ఎలాంటి సినిమా తీశాడో.. అభిరామ్ను ఎంత బాగా ప్రెజెంట్ చేశాడో చూడాలి మరి. ఈ చిత్రంతో గీతిక అనే కొత్తమ్మాయి కథానాయికగా పరిచయం అవుతోంది.
This post was last modified on June 2, 2023 11:55 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…