బాలకృష్ణ , అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ యాక్షన్ డ్రామా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. ఇందులో సరికొత్త లుక్ , ఆకట్టుకునే గెటప్ తో బాలయ్య కనిపించనున్నాడు. సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడతారని ఇన్ సైడ్ టాక్ ఉంది. అలాగే ఇందులో ఫాదర్ , డాటర్ మధ్య సెంటిమెంట్ డ్రామా ఉంటుందని చెప్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ చెప్పలేదు మేకర్స్. బాలయ్య పుట్టిన రోజు నాడు ఓ స్పెషల్ గ్లిమ్స్ తో టైటిల్ ఎనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ప్రచారం ఉంది. ఇక ఈ టైటిల్ పై బాలయ్య అభిమానుల్లో ఉన్న సందేహం తాజాగా ఓ పోస్టర్ తో వీడింది.
సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. తాజాగా మైత్రి సంస్థ ఈస్ట్ గోదావరీ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు. అక్కడ బాలయ్య స్టిల్ తో పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్ మీద భగవత్ కేసరి అనే టైటిల్ కనిపించడంతో ఆఫీషియల్ గా టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది.
మైత్రి సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే ఆఫీషియల్ పోస్టర్ ఆఫీస్ లో పెట్టేశారు. అయితే ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా సినిమాకు అనీల్ రావిపూడి ఈ టైటిల్ ఎందుకు పెట్టారన్నది త్వరలోనే తెలియనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీ లీల కూతురి పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on June 1, 2023 10:09 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…