బాలకృష్ణ , అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ యాక్షన్ డ్రామా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. ఇందులో సరికొత్త లుక్ , ఆకట్టుకునే గెటప్ తో బాలయ్య కనిపించనున్నాడు. సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడతారని ఇన్ సైడ్ టాక్ ఉంది. అలాగే ఇందులో ఫాదర్ , డాటర్ మధ్య సెంటిమెంట్ డ్రామా ఉంటుందని చెప్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ చెప్పలేదు మేకర్స్. బాలయ్య పుట్టిన రోజు నాడు ఓ స్పెషల్ గ్లిమ్స్ తో టైటిల్ ఎనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ప్రచారం ఉంది. ఇక ఈ టైటిల్ పై బాలయ్య అభిమానుల్లో ఉన్న సందేహం తాజాగా ఓ పోస్టర్ తో వీడింది.
సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. తాజాగా మైత్రి సంస్థ ఈస్ట్ గోదావరీ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు. అక్కడ బాలయ్య స్టిల్ తో పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్ మీద భగవత్ కేసరి అనే టైటిల్ కనిపించడంతో ఆఫీషియల్ గా టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది.
మైత్రి సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే ఆఫీషియల్ పోస్టర్ ఆఫీస్ లో పెట్టేశారు. అయితే ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా సినిమాకు అనీల్ రావిపూడి ఈ టైటిల్ ఎందుకు పెట్టారన్నది త్వరలోనే తెలియనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీ లీల కూతురి పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on June 1, 2023 10:09 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…