ముందు నుంచి ప్రచారం జరిగినట్టే లీకైనట్టే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మూడు ముళ్ళు వేయడానికి ముందు ఈ నెల 9న నిశ్చితార్థం వేడుక జరపబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అయితే దీనికి రెండు కుటుంబాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు తప్ప ఇండస్ట్రీ నుంచి కానీ మీడియా నుంచి కానీ ఎవరిని పిలవడం లేదని వినికిడి. వివాహ తేదీ, వేదిక ఖరారు చేసుకున్నాక దానికి సంబందించిన వివరాలను బయట పెట్టబోతున్నారు. ఎంగేజ్ మెంట్ మాత్రం పూర్తిగా ప్రైవేట్ ఎఫైర్ తరహాలోనే జరగబోతోంది.
చిరంజీవి భోళా శంకర్ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చేశారు. నాగబాబు ఎలాగూ అందుబాటులో ఉంటాడు. షూటింగులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు నగరంలోనే ఒక్క రోజు కేటాయించడం పెద్ద సమస్య కాదు. ఇక మిగిలిన కుటుంబ సభ్యుల సంగతి సరేసరి. హైదరాబాద్ లోనే జరగబోయే నిశ్చితార్థం ఎక్కడనేది ఇంకా తెలియలేదు. లావణ్య త్రిపాఠి స్వరాష్టం ఉత్తర్ ప్రదేశ్. ముంబైలో విద్యాభ్యాసం చేసింది. 2012లో అందాల రాక్షసితో డెబ్యూ చేసి తొలుత మంచి విజయాలు దక్కినా ఆ తర్వాత కెరీర్ స్లో అయిపోయింది
ఈ జంట కలయికలో మిస్టర్, అంతరిక్షం వచ్చాయి. కానీ రెండు డిజాస్టర్ కావడం ట్విస్ట్. సినిమాలు పోయినా రియల్ లైఫ్ లవ్ మాత్రం సూపర్ హిట్ అయిపోయి పెళ్లి పీఠల దాకా వెళ్లడం విశేషం. వరుణ్ చెల్లెలు నీహారిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మెగా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారిన తరుణంలో ఇప్పుడు వరుణ్ పెళ్లి వ్యవహారాలు రిలీఫ్ ఇస్తాయి. గత అయిదేళ్ళుగా వరుణ్ లావణ్యలు ప్రేమలో ఉన్నారని ఫ్రెండ్స్ అంటుంటారు కానీ చాలా కాలం అది బయట పడకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు కథ ఇలా సుఖాంతం కాబోతోంది. అఫీషియల్ నోట్ రావాల్సి ఉంది
This post was last modified on June 1, 2023 3:49 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…