Movie News

ఐదు కోట్ల విరాళం.. షారుఖ్‌ను ఇరికించే ప్రయత్నమా?

నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయోధ్యలో ఇటీవలే భూమిపూజ జరిగిన రామాలయం నిర్మాణం కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ఇచ్చాడన్నదే ఆ వార్త. ముస్లిం అయిన షారుఖ్.. రామ మందిరానికి 5 కోట్ల విరాళం ఇచ్చాడన్న వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ వార్త నిజమే అని నమ్మిన ఓ వర్గం షారుఖ్‌లో ఎంత గొప్ప మత సామరస్యం ఉందో.. ఎంతటి సేవా భావం ఉందో అంటూ పొగిడేసింది. కానీ షారుఖ్ సోషల్ మీడియా అకౌంట్లలోకి వెళ్లి చూసినా.. పెద్ద న్యూస్ ఏజెన్సీల్లో వార్తలు చెక్ చేసినా ఇది నిజం కాదని స్పష్టమవుతోంది. ఇది జస్ట్ రూమర్ అన్న విషయం తేలిపోయింది.

బాలీవుడ్ బడా హీరోల్లో మిగతా హీరోలతో పోలిస్తే షారుఖ్‌లో సేవా భావం తక్కువే అన్నది వివిధ సందర్భాల్లో రుజువైంది. కరోనా టైంలో కూడా షారుఖ్ పెద్దగా విరాళమేమీ ప్రకటించినట్లు వార్తలు రాలేదు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు ఇస్తున్నాడని.. తన భవనాన్ని కోవిడ్ సేవ కోసం అందిస్తున్నాడని వార్తలొచ్చాయి కానీ.. వీటిపై అధికారిక సమాచారాలేమీ రాలేదు.

ఏదైనా పెద్ద ఉపద్రవాలు వచ్చినపుడు అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటారు కానీ.. షారుఖ్ ఈ విషయంలో ఎప్పుడూ వెనుకే. ఇక అతను ముస్లిం పక్షపాతి అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో షారుఖ్‌ను ఇరుకున పెట్టడానికి కావాలనే ఎవరో ఈ 5 కోట్ల విరాళం వార్త సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆ వార్తను షారుఖ్ ఖండించనూ లేడు. అలాగని అంత పెద్ద మొత్తంలో ఓ హిందూ ఆలయానికి విరాళం ఇవ్వనూ లేడు.

This post was last modified on August 9, 2020 2:09 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

4 mins ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

45 mins ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

46 mins ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

54 mins ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

1 hour ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

1 hour ago