గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చాలా సందర్భాల్లో సూటిగానే మాట్లాడతారు. కాకపోతే వ్యక్తుల ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా అది ఎవరి గురించోననే హిట్ మాత్రం కరెక్ట్ గా ఇస్తారు. ఇవాళ జరిగిన 2018 సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చందూ మొండేటితో తమ బ్యానర్ లో రెండు సినిమాలు వస్తాయని, కమిట్ మెంట్ ఇచ్చాడని, కొందరిలాగా మూలాలు మర్చిపోయి వెన్నుపోటు పొడిచే రకం కాదని దర్శకుడి మీద ప్రశంసలు గుప్పించారు. ఈ పంచు ఎవరి మీదో అర్థమయ్యిందిగా
కొన్ని నెలల క్రితం పరశురామ్ గీత ఆర్ట్స్ తో చేయాల్సిన విజయ్ దేవరకొండ సినిమాని హఠాత్తుగా దిల్ రాజు వైపు తిప్పేయడంతో అరవింద్ బాగా హర్ట్ అయ్యారు. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేయాలన్నది ఆయన ప్లాన్. కానీ ఇలా సడన్ ట్విస్టు రావడంతో ఎస్విసి అనౌన్స్ మెంట్ ఇచ్చిన రోజే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని బహిర్గతం చేయాలనుకున్నారు. కానీ అందరూ సర్దిచెప్పడంతో వెనక్కు తగ్గారే తప్ప ఆ ఫీలింగ్ మాత్రం అలాగే మనసులో ఉండిపోయిందని సన్నితుల మాట. ఇదిగో ఇలా ఈ సందర్భంలో బయట పడ్డారు. ఇక్కడా డైరెక్ట్ గా పేర్ల ప్రస్తావన రాలేదు.
ప్రస్తుతం రామ్ తో చేస్తున్న మూవీ తర్వాత బోయపాటి శీను మళ్ళీ గీతా కోసం ఓ ప్రాజెక్ట్ చేస్తారని అరవింద్ అన్నారు. సరైనోడు కలయికను రిపీట్ చేస్తూ అల్లు అర్జున్ తో సెట్ చేస్తారా లేక ఇంకో స్టార్ హీరోని తీసుకొస్తారా అనేది మాత్రం బయట పడలేదు. ఇండస్ట్రీలో ఇలా చేతులు మారిపోయే సినిమాల గురించి, మాట ఇచ్చి తప్పడాల గురించి ఎన్నో కథలు ఉన్నాయి కానీ అవి బహిర్గతమయ్యేది చాలా తక్కువ. ఇప్పుడు కూడా అరవింద్ నేమ్ చెప్పలేదు కానీ క్లియర్ గా హింట్ ఇచ్చారు. ఆ మధ్య నాగచైతన్య ఏకంగా పరుశురాం అని చెప్పి మరీ అసంతృప్తి వెలిబుచ్చాడు
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…