అయిపోయిన పెళ్ళికి బాజాలు మాట్లాడితే కామెడీగా ఉంటుంది. చూస్తుంటే ఏజెంట్ వ్యవహారం అలాగే అనిపిస్తోంది. బాక్సాఫీస్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఏజెంట్ వాస్తవానికి మొన్న మే 19న ఓటిటిలో వచ్చేయాలి. థియేటర్లో మిస్ అయినవాళ్లు ఓసారి చూద్దాం లెమ్మని ఎదురు చూశారు. దీని తాలూకు హింట్ గతంలోనే సోనీ లివ్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇచ్చింది. తీరా చూస్తే ఆ రోజు డిజిటల్ ప్రీమియర్ జరగలేదు. సరే ఇంకో వారం పోస్ట్ పోన్ అయిందేమో అనుకున్నారు. కానీ జూన్ 23 కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ న్యూస్
దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఏజెంట్ ని మళ్ళీ ఫ్రెష్ గా ఎడిటింగ్ చేస్తున్నారట. ఏప్రిల్ నెలలో విపరీతమైన ఒత్తిడి మధ్య పోస్ట్ ప్రొడక్షన్ చేయడం వల్ల కత్తెరకు సరిగా పని చెప్పలేదట. దీని వల్లే అనవసరమైన సీన్లు, సాగదీసిన ఫైట్లు ఎక్కువయ్యాయని గుర్తించి ఆ మేరకు కోత కార్యక్రమం మొదలుపెట్టినట్టు తెలిసింది. పక్కనపెట్టిన ఫుటేజ్ లో కొన్ని భాగాలు కలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. అధికారిక సమాచారం లేదు కానీ మొత్తానికి ఇదంతా గుట్టుగా జరిగిపోతోంది. ఒరిజినల్ వెర్షన్ యధాతథంగా వదిలితే ట్రోలింగ్ ప్రమాదం పసిగట్టారు కాబోలు
ఏది ఏమైనా ఏజెంట్ విషయంలో జరుగుతున్న ఓటిటి ఆలస్యం చాలా ఎక్కువ. అంత లేట్ చేస్తే ఉన్న కాసింత ఆసక్తి కూడా తగ్గిపోయి వ్యూస్ కు ఎసరుపడే ప్రమాదం ఉంది. ఫలితాన్ని ఎలాగూ మార్చలేనప్పుడు దాన్ని ఒప్పేసుకుని ప్రేక్షకులకు చిన్నితెరపై చూపించేస్తే ఓ పనైపోతుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే కానీ అదేదో త్వరగా అయిపోతే బాగుంటుంది కదా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ లో మమ్ముట్టి లాంటి మలయాళం స్టార్ హీరో కీలక పాత్ర చేయడంతో కేరళలోనూ థియేటర్ అనుభూతి మిస్ అయినవాళ్ళు దీని కోసం ఎదురు చూస్తున్నారు
This post was last modified on May 29, 2023 11:54 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…