అయిపోయిన పెళ్ళికి బాజాలు మాట్లాడితే కామెడీగా ఉంటుంది. చూస్తుంటే ఏజెంట్ వ్యవహారం అలాగే అనిపిస్తోంది. బాక్సాఫీస్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఏజెంట్ వాస్తవానికి మొన్న మే 19న ఓటిటిలో వచ్చేయాలి. థియేటర్లో మిస్ అయినవాళ్లు ఓసారి చూద్దాం లెమ్మని ఎదురు చూశారు. దీని తాలూకు హింట్ గతంలోనే సోనీ లివ్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇచ్చింది. తీరా చూస్తే ఆ రోజు డిజిటల్ ప్రీమియర్ జరగలేదు. సరే ఇంకో వారం పోస్ట్ పోన్ అయిందేమో అనుకున్నారు. కానీ జూన్ 23 కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదని ఇన్ సైడ్ న్యూస్
దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఏజెంట్ ని మళ్ళీ ఫ్రెష్ గా ఎడిటింగ్ చేస్తున్నారట. ఏప్రిల్ నెలలో విపరీతమైన ఒత్తిడి మధ్య పోస్ట్ ప్రొడక్షన్ చేయడం వల్ల కత్తెరకు సరిగా పని చెప్పలేదట. దీని వల్లే అనవసరమైన సీన్లు, సాగదీసిన ఫైట్లు ఎక్కువయ్యాయని గుర్తించి ఆ మేరకు కోత కార్యక్రమం మొదలుపెట్టినట్టు తెలిసింది. పక్కనపెట్టిన ఫుటేజ్ లో కొన్ని భాగాలు కలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. అధికారిక సమాచారం లేదు కానీ మొత్తానికి ఇదంతా గుట్టుగా జరిగిపోతోంది. ఒరిజినల్ వెర్షన్ యధాతథంగా వదిలితే ట్రోలింగ్ ప్రమాదం పసిగట్టారు కాబోలు
ఏది ఏమైనా ఏజెంట్ విషయంలో జరుగుతున్న ఓటిటి ఆలస్యం చాలా ఎక్కువ. అంత లేట్ చేస్తే ఉన్న కాసింత ఆసక్తి కూడా తగ్గిపోయి వ్యూస్ కు ఎసరుపడే ప్రమాదం ఉంది. ఫలితాన్ని ఎలాగూ మార్చలేనప్పుడు దాన్ని ఒప్పేసుకుని ప్రేక్షకులకు చిన్నితెరపై చూపించేస్తే ఓ పనైపోతుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే కానీ అదేదో త్వరగా అయిపోతే బాగుంటుంది కదా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ లో మమ్ముట్టి లాంటి మలయాళం స్టార్ హీరో కీలక పాత్ర చేయడంతో కేరళలోనూ థియేటర్ అనుభూతి మిస్ అయినవాళ్ళు దీని కోసం ఎదురు చూస్తున్నారు
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…