సుమంత్ ప్రభాస్ హీరో కం డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ , లహరి ఫిల్మ్స్ నిర్మించిన ‘మేమ్ ఫేమస్’ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేసి హైప్ క్రియేట్ చేసి రిలీజ్ కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. అయితే ముందు నుండి ప్రమోషన్స్ లో టీం చెప్పినట్లు సినిమాకి సూపర్ హిట్ టాక్ రాలేదు. ప్రీమియర్స్ తర్వాత ఆడియన్స్ నుండి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలి రోజు కలెక్షన్స్ మీద గట్టి ఎఫెక్ట్ పడింది. అక్కడి నుండి సినిమా భారీ వసూళ్లు రాబట్టలేక మినిమం కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. వీకెండ్ వరకూ మూడు కోట్లు వచ్చాయని మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా రిజల్ట్ పై నిర్మాతలు సోమవారం పంచాయితీ పేరుతో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఒక నెగటివ్ బ్యాచ్ సినిమాను డ్యామేజ్ చేస్తుందని వాపోయారు. ముఖ్యంగా ట్విటర్ లో చూసి నచ్చిన వారి ఓపినియన్ పై డిస్కషన్ పెడుతూ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపారు. బుక్ మై షోలో పనిగట్టుకొని మరీ కావాలని తక్కువ రేటింగ్ ఇచ్చారని చెప్పుకున్నారు. తమ సినిమాను ట్రోల్ , రోస్టెడ్ చేస్తున్న వారితో డిబేట్ కి సిద్దమని అందుకే ఈ పంచాయితీ పెట్టామని అన్నారు. ఈ పంచాయితీ ప్రెస్ మీట్ దర్శకుడు హరీష్ శంకర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ లో స్కిప్ కొట్టారు.
ఇక మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ తో నిర్మాతలు అనురాగ్ , శరత్ అన్ హ్యాపీ గా ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తవారితో తీసిన ఈ సినిమా ‘జాతిరతాలు’ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని భావించిన వారి ఆశలపై సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్ నీళ్ళు జల్లింది. ఇక సోషల్ మీడియాలో సెకండాఫ్ నచ్చలేదని కొందరు ప్రేక్షకకులు చెప్తున్నారు. కానీ దాన్ని పట్టించుకోకుండా మేకర్స్ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై స్పీచులతో పంచాయితీ పెట్టుకున్నారు. ఛాయ్ బిస్కెట్ సంస్థ డిజిటల్ మీడియా నుండి సినిమా నిర్మాణం వైపు వచ్చింది. సోషల్ మీడియాలో జనాల సంగతి వారికి తెలియనిది కాదు. మరి నెగెటివ్ కామెంట్స్ పై ఈ పంచాయితీ ఎందుకో వారికే తెలియాలి. సినిమాలో దమ్ముంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సాదిస్తాయని దాన్ని ఎవరూ ఆపలేరని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. బలగం దీనికి ఓ చక్కని ఉదహాహారణ.
This post was last modified on May 29, 2023 11:21 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…