సుమంత్ ప్రభాస్ హీరో కం డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ , లహరి ఫిల్మ్స్ నిర్మించిన ‘మేమ్ ఫేమస్’ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేసి హైప్ క్రియేట్ చేసి రిలీజ్ కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. అయితే ముందు నుండి ప్రమోషన్స్ లో టీం చెప్పినట్లు సినిమాకి సూపర్ హిట్ టాక్ రాలేదు. ప్రీమియర్స్ తర్వాత ఆడియన్స్ నుండి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలి రోజు కలెక్షన్స్ మీద గట్టి ఎఫెక్ట్ పడింది. అక్కడి నుండి సినిమా భారీ వసూళ్లు రాబట్టలేక మినిమం కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. వీకెండ్ వరకూ మూడు కోట్లు వచ్చాయని మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా రిజల్ట్ పై నిర్మాతలు సోమవారం పంచాయితీ పేరుతో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఒక నెగటివ్ బ్యాచ్ సినిమాను డ్యామేజ్ చేస్తుందని వాపోయారు. ముఖ్యంగా ట్విటర్ లో చూసి నచ్చిన వారి ఓపినియన్ పై డిస్కషన్ పెడుతూ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపారు. బుక్ మై షోలో పనిగట్టుకొని మరీ కావాలని తక్కువ రేటింగ్ ఇచ్చారని చెప్పుకున్నారు. తమ సినిమాను ట్రోల్ , రోస్టెడ్ చేస్తున్న వారితో డిబేట్ కి సిద్దమని అందుకే ఈ పంచాయితీ పెట్టామని అన్నారు. ఈ పంచాయితీ ప్రెస్ మీట్ దర్శకుడు హరీష్ శంకర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ లో స్కిప్ కొట్టారు.
ఇక మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ తో నిర్మాతలు అనురాగ్ , శరత్ అన్ హ్యాపీ గా ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తవారితో తీసిన ఈ సినిమా ‘జాతిరతాలు’ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని భావించిన వారి ఆశలపై సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్ నీళ్ళు జల్లింది. ఇక సోషల్ మీడియాలో సెకండాఫ్ నచ్చలేదని కొందరు ప్రేక్షకకులు చెప్తున్నారు. కానీ దాన్ని పట్టించుకోకుండా మేకర్స్ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై స్పీచులతో పంచాయితీ పెట్టుకున్నారు. ఛాయ్ బిస్కెట్ సంస్థ డిజిటల్ మీడియా నుండి సినిమా నిర్మాణం వైపు వచ్చింది. సోషల్ మీడియాలో జనాల సంగతి వారికి తెలియనిది కాదు. మరి నెగెటివ్ కామెంట్స్ పై ఈ పంచాయితీ ఎందుకో వారికే తెలియాలి. సినిమాలో దమ్ముంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సాదిస్తాయని దాన్ని ఎవరూ ఆపలేరని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. బలగం దీనికి ఓ చక్కని ఉదహాహారణ.
This post was last modified on May 29, 2023 11:21 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…