సీనియర్ దర్శకుడు తేజకు టాలీవుడ్లో మరే దర్శకుడికీ లేని స్పెషాలిటీ ఉంది. ఆయన కొత్త టాలెంట్ను వెతికి వెతికి పట్టుకుంటారు. తన ప్రతి సినిమాతోనూ బోలెడంతమంది నటీనటులతో పాటు టెక్నీషియన్లను ఆయన వెండితెరకు పరిచయం చేస్తుంటారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఆయన పరిచయం చేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల సంఖ్య వెయ్యికి పైనేనట. ఈ విషయాన్ని తన కొత్త చిత్రం ‘అహింస’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయనే స్వయంగా వెల్లడించారు.
‘అహింస’ సినిమాతోనూ హీరో హీరోయిన్లు అభిరామ్ దగ్గుబాటి, గీతికలతో పాటు పలువురిని పరిచయం చేస్తున్నారు తేజ. ఇదిలా ఉంటే.. షకీలా అనే సాఫ్ట్ పోర్న్ మలయాళ సినిమాలు చేసుకునే నటిని సైతం రెగ్యులర్ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తేజకే చెందుతుంది. అలాంటి నేపథ్యం ఉన్న నటిని తాను ‘జయం’ సినిమాలోకి ఎలా తీసుకున్నానో తేజ ‘అహింస’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు.
“జయం సినిమా మొదలవడానికి ముందు నేను, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, మరొకరు కలిసి హైదరాబాద్లో కార్లో వెళ్తున్నాం. అలా వెళ్తుండగా.. తారకరామ థియేటర్ దగ్గర పెద్ద జన సందోహం కనిపించింది. కుర్రాళ్లు థియేటర్ గేట్లు ఓపెన్ చేయగానే తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంతగా ఉత్సాహం చూపిస్తున్నారు ఏం సినిమా అబ్బా ఇది అని చూస్తే.. ‘కామేశ్వరి’ సినిమా పోస్టర్ కనిపించింది.
ఇది ఎవరి సినిమా అని అడిగితే.. షకీలా గురించి చెప్పారు. ఎందుకు ఈమెకు ఇంత క్రేజ్ అనుకుని నేను థియేటర్లోకి వెళ్లి మేనేజర్కు చెప్పి మాక్కూడా మూడు టికెట్లు ఇవ్వమన్నా. మీరు ఇలాంటి సినిమా చూడ్డం ఏంటి అని అతను ఆశ్చర్యపోయాడు. కానీ టికెట్లివ్వమని లోపలికి వెళ్లా. అక్కడ చూస్తే షకీలా కనిపించగానే కుర్రాళ్లు హారతులు పడుతున్నారు. ఆ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. తెర మీద ఆమెను చూశాక.. ఈమే నా సినిమాలో లెక్చరర్ అని ఫిక్సయిపోయా. నేను నటీనటులను ఎంచుకునే విధానం ఇలా ఉంటుంది” అని తేజ తెలిపారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…