సీనియర్ దర్శకుడు తేజకు టాలీవుడ్లో మరే దర్శకుడికీ లేని స్పెషాలిటీ ఉంది. ఆయన కొత్త టాలెంట్ను వెతికి వెతికి పట్టుకుంటారు. తన ప్రతి సినిమాతోనూ బోలెడంతమంది నటీనటులతో పాటు టెక్నీషియన్లను ఆయన వెండితెరకు పరిచయం చేస్తుంటారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఆయన పరిచయం చేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల సంఖ్య వెయ్యికి పైనేనట. ఈ విషయాన్ని తన కొత్త చిత్రం ‘అహింస’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయనే స్వయంగా వెల్లడించారు.
‘అహింస’ సినిమాతోనూ హీరో హీరోయిన్లు అభిరామ్ దగ్గుబాటి, గీతికలతో పాటు పలువురిని పరిచయం చేస్తున్నారు తేజ. ఇదిలా ఉంటే.. షకీలా అనే సాఫ్ట్ పోర్న్ మలయాళ సినిమాలు చేసుకునే నటిని సైతం రెగ్యులర్ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తేజకే చెందుతుంది. అలాంటి నేపథ్యం ఉన్న నటిని తాను ‘జయం’ సినిమాలోకి ఎలా తీసుకున్నానో తేజ ‘అహింస’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు.
“జయం సినిమా మొదలవడానికి ముందు నేను, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, మరొకరు కలిసి హైదరాబాద్లో కార్లో వెళ్తున్నాం. అలా వెళ్తుండగా.. తారకరామ థియేటర్ దగ్గర పెద్ద జన సందోహం కనిపించింది. కుర్రాళ్లు థియేటర్ గేట్లు ఓపెన్ చేయగానే తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంతగా ఉత్సాహం చూపిస్తున్నారు ఏం సినిమా అబ్బా ఇది అని చూస్తే.. ‘కామేశ్వరి’ సినిమా పోస్టర్ కనిపించింది.
ఇది ఎవరి సినిమా అని అడిగితే.. షకీలా గురించి చెప్పారు. ఎందుకు ఈమెకు ఇంత క్రేజ్ అనుకుని నేను థియేటర్లోకి వెళ్లి మేనేజర్కు చెప్పి మాక్కూడా మూడు టికెట్లు ఇవ్వమన్నా. మీరు ఇలాంటి సినిమా చూడ్డం ఏంటి అని అతను ఆశ్చర్యపోయాడు. కానీ టికెట్లివ్వమని లోపలికి వెళ్లా. అక్కడ చూస్తే షకీలా కనిపించగానే కుర్రాళ్లు హారతులు పడుతున్నారు. ఆ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. తెర మీద ఆమెను చూశాక.. ఈమే నా సినిమాలో లెక్చరర్ అని ఫిక్సయిపోయా. నేను నటీనటులను ఎంచుకునే విధానం ఇలా ఉంటుంది” అని తేజ తెలిపారు.
This post was last modified on May 28, 2023 1:42 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…