Movie News

మేమ్ ఫేమస్ ట్రోలింగ్‌పై నిర్మాత రియాక్షన్

చిన్న సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో సవాలే. ఐతే ‘మేమ్ ఫేమస్’ అనే చిన్న సినిమాను దాని టీం భలే వెరైటీగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగలిగింది. విడుదలకు ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయగా.. ఆ షోలన్నీ ఫుల్స్ అవుతున్నాయంటే విశేషమే. ఛాయ్ బిస్కెట్ అధినేతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సెలబ్రెటీలు చాాలామంది తమ సపోర్ట్ ఇచ్చారు.

వెరైటీ ప్రమోషన్లలో భాగం అయ్యారు. చివరగా శరత్, అనురాగ్‌లతో కలిసి ‘మేజర్’ సినిమాను నిర్మించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ‘మేమ్ ఫేమస్’ గురించి పాజిటివ్ ట్వీట్ వేసి టీంను సంతోషంలో ముంచెత్తాడు. కానీ దీనిపై నెటిజన్లు ఊహించని రీతిలో స్పందించారు. ‘మేమ్ ఫేమస్’ టీంను ట్రోల్ చేశారు.

‘మేమ్ ఫేమస్’ సినిమాను మహేష్ సహా సెలబ్రెటీలంతా మరీ అతిగా పొగుడుతున్నారంటూ సెటైర్లు వేశారు. మహేష్ ట్వీట్ మీద నిర్మాత శరత్ చంద్ర స్పందించిన తీరు.. ఉమ్మడి భాగస్వామ్యంలో మరో సినిమా చేయాలన్న ఆయన ప్రతిపాదనకు మహేష్ ఓకే చెప్పడం.. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిన ప్రమోషన్ అంటూ కౌంటర్లు వేశారు. ఈ ట్రోల్స్ శృతి మించడంతో నిర్మాత శరత్ చంద్ర మీడియాతో మాట్లాడాడు.

రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. “మహేష్ గారు ఈ సినిమాను మెచ్చుకుంటే కొందరు ట్రోల్స్ చేశారు. అసలు ఏం సంబంధం లేని వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరైన పద్ధతి కాదు. ఏదైనా పాజిటివ్‌గా మాట్లాడితే అంతా పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్‌గా మాట్లాడితే నెగెటివ్‌గా ఉంటుంది. మా సినిమా హీరో, డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తి. తన ప్రతిభతో అతను హీరోగా, దర్శకుడిగా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు” అని శరత్ చంద్ర పేర్కొన్నాడు.

This post was last modified on May 26, 2023 12:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

6 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

10 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago