ఈ మధ్య సినిమాల ప్రమోషన్లు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. మొదటి రోజు ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం ఎవరెస్ట్ ఎక్కడం కన్నా కష్టమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేరోజు చిన్న బడ్జెట్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మేం ఫేమస్ ని ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్లు వేస్తున్నారు. అది కూడా 99 రూపాయలకే. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఆ షోలకు బుకింగ్స్ వేగంగా ఉన్నాయి.
వాటి నుంచి వచ్చే టాక్ తర్వాతి రోజు నుంచి సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెస్తుందని నిర్మాతలు చూస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ కు ఇలాగే వర్కౌట్ అయ్యింది. ఇక నరేష్ పవిత్ర లోకేష్ ల మళ్ళీ పెళ్లికి ఈవెంట్లు ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయాయి. కొన్ని వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. రిటైర్మెంట్ వయసులో ఉన్న హీరోకు ఓపెనింగ్స్ ఆశించడం అత్యాశే కానీ ఇది నరేష్ నాలుగో పెళ్లికి సంబంధించిన రియల్ బయోపిక్ లాంటి కథ కావడంతో జనాల ఆసక్తి బాగానే ఉంది.
అయితే ఇది టికెట్లు కొనే స్థాయిలో ఉందా లేదానేది రేపు సాయంత్రానికి తేలిపోతుంది. అడ్వాన్స్ సేల్స్ మాత్రం నత్తనడకన ఉన్నాయి. మలయాళం బ్లాక్ బస్టర్ 2018 కి సైతం బయట పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. సెలబ్రిటీ షోకు రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది. మైత్రి సమర్పిస్తున్న మీటూ సైతం ఇదే సమస్యతో ఇబ్బంది పడుతోంది. చూసే కొద్దిమంది చాలా బాగుందనే మాట స్ప్రెడ్ చేస్తే పికప్ ఆశించవచ్చు.
పైగా ఇందులో స్టార్ క్యాస్టింగ్ లేదు. అందరూ టాలెంట్ ఉన్న యాక్టర్లే. అమ్మాయిలు భార్యల బాధితుల చుట్టూ నడిపించిన కథ కాబట్టి ఎంటర్ టైన్మెంటే పబ్లిక్ ని లాక్కురావాలి. ఇవి కాకుండా చితక సినిమాలు మరికొన్ని ఉన్నాయి కానీ ప్రధానంగా హైలైట్ అవుతున్నది ఈ నాలుగే. బాక్సాఫీస్ బాగా డల్లుగా ఉన్న టైంలో ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే మంచి కలెక్షన్లు రాబట్టుకోవచ్చు. మరి విజేత ఎవరవుతారో.
This post was last modified on May 25, 2023 11:47 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…