Movie News

ఆర్ఆర్ఆర్ నిర్మాత‌కూ క‌రోనా

సెల‌బ్రెటీలెవ‌రైనా క‌రోనా వైర‌స్ బారిన ప‌డితే ఆశ్చ‌ర్య‌పోయే రోజులు పోయాయి. అమితాబ్ బ‌చ్చ‌న్ అంత‌టి వాడే ఈ మ‌హ‌మ్మారి బాధితుడయ్యాడు. మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళిని సైతం వైర‌స్ ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు వైర‌స్ ఎలా సోకింది ఏంట‌నే విష‌యం తెలియ‌దు. ఇప్పుడు రాజ‌మౌళితో ఆర్ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య సైతం క‌రోనా బాధితుడిగా తేలారు. కొన్ని రోజులుగా ఆయ‌న‌కు జ‌లుబు, జ్వ‌రం ఉన్నాయ‌ట‌. దీంతో ప‌రీక్ష చేయించుకున్నారు. అందులో క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఐతే తీవ్ర ల‌క్ష‌ణాలేమీ లేవ‌ని.. దాన‌య్య ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని అంటున్నారు. ఆయ‌న ఇంటి వ‌ద్దే ఉండి చికిత్సి తీసుకుంటున్నారా.. ఆసుప‌త్రిలో చేరుతున్నారా అన్న‌ది తెలియ‌దు.

ముందు రాజ‌మౌళికి, ఆ త‌ర్వాత దాన‌య్య‌కు క‌రోనా వ‌చ్చిన నేప‌థ్యంలో వీరి మ‌ధ్య ఏమైనా కాంటాక్ట్ ఉండి ఒక‌రి నుంచి ఒక‌రికి క‌రోనా వ‌చ్చిందా అని అనుమానిస్తున్నారు. కొన్ని నెల‌ల పాటు ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన ప‌నులు ఆగిపోగా.. గ‌త నెల‌లో షూటింగ్ పునఃప్రారంభించేందుకు ట్ర‌య‌ల్ షూట్ కోసం స‌న్నాహాలు జ‌రిగాయి. కానీ త‌ర్వాత ప‌రిస్థితులు బాలేవ‌ని వెన‌క్కి త‌గ్గారు. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా విష‌యంలో అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు తేజ సైతం క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్న నేప‌థ్యంలో సామాన్యులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

This post was last modified on August 8, 2020 7:57 am

Share
Show comments
Published by
suman

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

6 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago