సెలబ్రెటీలెవరైనా కరోనా వైరస్ బారిన పడితే ఆశ్చర్యపోయే రోజులు పోయాయి. అమితాబ్ బచ్చన్ అంతటి వాడే ఈ మహమ్మారి బాధితుడయ్యాడు. మన దర్శక ధీరుడు రాజమౌళిని సైతం వైరస్ పలకరించిన సంగతి తెలిసిందే. ఆయనకు వైరస్ ఎలా సోకింది ఏంటనే విషయం తెలియదు. ఇప్పుడు రాజమౌళితో ఆర్ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సైతం కరోనా బాధితుడిగా తేలారు. కొన్ని రోజులుగా ఆయనకు జలుబు, జ్వరం ఉన్నాయట. దీంతో పరీక్ష చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్గా తేలింది. ఐతే తీవ్ర లక్షణాలేమీ లేవని.. దానయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. ఆయన ఇంటి వద్దే ఉండి చికిత్సి తీసుకుంటున్నారా.. ఆసుపత్రిలో చేరుతున్నారా అన్నది తెలియదు.
ముందు రాజమౌళికి, ఆ తర్వాత దానయ్యకు కరోనా వచ్చిన నేపథ్యంలో వీరి మధ్య ఏమైనా కాంటాక్ట్ ఉండి ఒకరి నుంచి ఒకరికి కరోనా వచ్చిందా అని అనుమానిస్తున్నారు. కొన్ని నెలల పాటు ఆర్ఆర్ఆర్కు సంబంధించిన పనులు ఆగిపోగా.. గత నెలలో షూటింగ్ పునఃప్రారంభించేందుకు ట్రయల్ షూట్ కోసం సన్నాహాలు జరిగాయి. కానీ తర్వాత పరిస్థితులు బాలేవని వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా.. కరోనా విషయంలో అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన సీనియర్ దర్శకుడు తేజ సైతం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో సామాన్యులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
This post was last modified on August 8, 2020 7:57 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…