సెలబ్రెటీలెవరైనా కరోనా వైరస్ బారిన పడితే ఆశ్చర్యపోయే రోజులు పోయాయి. అమితాబ్ బచ్చన్ అంతటి వాడే ఈ మహమ్మారి బాధితుడయ్యాడు. మన దర్శక ధీరుడు రాజమౌళిని సైతం వైరస్ పలకరించిన సంగతి తెలిసిందే. ఆయనకు వైరస్ ఎలా సోకింది ఏంటనే విషయం తెలియదు. ఇప్పుడు రాజమౌళితో ఆర్ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సైతం కరోనా బాధితుడిగా తేలారు. కొన్ని రోజులుగా ఆయనకు జలుబు, జ్వరం ఉన్నాయట. దీంతో పరీక్ష చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్గా తేలింది. ఐతే తీవ్ర లక్షణాలేమీ లేవని.. దానయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. ఆయన ఇంటి వద్దే ఉండి చికిత్సి తీసుకుంటున్నారా.. ఆసుపత్రిలో చేరుతున్నారా అన్నది తెలియదు.
ముందు రాజమౌళికి, ఆ తర్వాత దానయ్యకు కరోనా వచ్చిన నేపథ్యంలో వీరి మధ్య ఏమైనా కాంటాక్ట్ ఉండి ఒకరి నుంచి ఒకరికి కరోనా వచ్చిందా అని అనుమానిస్తున్నారు. కొన్ని నెలల పాటు ఆర్ఆర్ఆర్కు సంబంధించిన పనులు ఆగిపోగా.. గత నెలలో షూటింగ్ పునఃప్రారంభించేందుకు ట్రయల్ షూట్ కోసం సన్నాహాలు జరిగాయి. కానీ తర్వాత పరిస్థితులు బాలేవని వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా.. కరోనా విషయంలో అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన సీనియర్ దర్శకుడు తేజ సైతం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో సామాన్యులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
This post was last modified on August 8, 2020 7:57 am
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…