పవర్ స్టార్ అభిమానులు యునానిమస్ గా చెప్పుకునే కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ. విడుదలైన పాతికేళ్ళవుతున్నా అందులో ఫ్రెష్ నెస్ ఇప్పటి జనరేషన్ కి సైతం కనెక్ట్ అవుతుంది. కేవలం హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ గట్రా లేకుండా స్వచ్ఛమైన స్నేహం, కుర్రాళ్లలో అమాయకత్వంతో పాటు అన్నా చెల్లెలి బంధం గురించి దర్శకుడు కరుణాకరన్ ఆవిష్కరించిన తీరు అతన్నే మళ్ళీ దాన్ని మించిన సినిమా తీయనివ్వలేదు. సంగీత దర్శకుడు దేవా ఇచ్చిన పాటల గురించి చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. అలంటి బ్లాక్ బస్టర్ కి ఇప్పుడు రీరిలీజ్ పంచాయితీలోకి రానుంది.
జూన్ 30న తొలిప్రేమను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటికే ఆడియన్స్ ఇలాంటి మళ్ళీ విడుదల వ్యవహారాల పట్ల విసుగెత్తిపోయి ఉన్నారు. ఖుషి, తమ్ముడు బాగా ఆడాయి. త్వరలో జనసేన నిధుల కోసం గుడుంబా శంకర్ ని ఎలాగూ ప్లాన్ చేశారు. ఇంత తక్కువ గ్యాప్ లో తొలిప్రేమని తీసుకొస్తే ఆ మేజిక్ ని ఫీల్ అయ్యేందుకు స్వంత ఫ్యాన్సే అంతగా ఇష్టపడకపోవచ్చు. చూసేవాళ్ళు చూస్తారు లేదంటే లేదనే లాజిక్ ఇక్కడ పని చేయదు. ఎందుకో ట్విట్టర్ గొడవలు చూస్తే అర్థమవుతుంది.
కేవలం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవడం తప్పించి ఇలా నెలకు రెండు మూడు రీ రిలీజులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మూవీ లవర్స్ వాపోతున్నారు. పైగా టికెట్ ధరల్లో ఎలాంటి తగ్గింపు లేకుండా రెగ్యులర్ రేట్లు పెట్టేసి మంచి మంచి క్లాసిక్స్ ని ఇలా వృధా చేయడం ద్వారా ఏం ఒరుగుతుందని బాధ పడుతున్నారు. ఇందులో నిజముంది. రెండు వారాలకు ఒకటి జేబులకు చిల్లులు పెట్టుకుంటూ ఫ్రీగా దొరికే వాటిని అంతంత డబ్బులేసి జనం చూడరుగా. అలాంటప్పుడు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి ప్లాన్ చేసుకుంటే బాగుండేది. పైగా జూలైలో యానివర్సరీ పెట్టుకుని జూన్ లో చేయడమేంటో.
This post was last modified on May 24, 2023 3:05 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…