భారతీయ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లది అరుదైన జోడీ. తండ్రి ఇండియన్ సినిమాలో పీక్స్ను చూస్తే.. ఆయన తనయుడిగా రంగ ప్రవేశం చేసి.. తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చిరు కూడా అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు.
అయినా సరే.. తన తండ్రి ముందు తాను చాలా చిన్నవాడిననే ఫీలవుతాడు చరణ్. తన తండ్రి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా గొప్పగా మాట్లాడతాడు. ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న జీ20 సదస్సుకు భారతీయ సినిమా ప్రతినిధిగా హాజరైన చరణ్.. కశ్మీర్ ప్రత్యేకత, భారతీయ సినిమా విశిష్టత గురించి మాట్లాడుతూనే.. మధ్యలో తన తండ్రి ప్రస్తావన తెచ్చాడు. తనకు ఆయనే స్ఫూర్తి అని చెబుతూ 68 ఏళ్ల వయసులో చిరు సినిమాల కోసం పడుతున్న కష్టాన్ని వివరించాడు.
‘‘నాకు మా నాన్నగారే స్ఫూర్తి. ఆయనతో పాటు షూటింగ్ చూడటం కోసం చిన్నపుడు కశ్మీర్కు వచ్చాను. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని దర్శించాను. ఇప్పుడు జీ20 సదస్సు కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న వయసు 68 ఏళ్లు. ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాలకు సంతకం చేశారు. ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఆయనొకరు. రోజూ ఉదయం 5.30కే నిద్ర లేస్తారు. తర్వాత వర్కవుట్ చేస్తారు. ఆపై రోజు వారీ పనికి వెళ్లిపోతారు. 68 ఏళ్ల వయసులోనూ పని పట్ల ఆయన చూపించే నిబద్ధత నాకు స్ఫూర్తినిస్తుంది. మరింత కష్టపడడానికి ప్రేరణగా నిలుస్తుంది’’ అని చరణ్ జీ20 సమ్మిట్లో తన తండ్రికి అదిరే ఎలివేషన్ ఇచ్చాడు.
కశ్మీర్ భూతల స్వర్గం అని.. ఇక్కడ షూటింగ్లు చేసుకోవడానికి అద్భుత అవకాశం ఉందని.. ఒక వేళ తనకు హాలీవుడ్ ఆఫర్లు వస్తే.. ఇండియాకే వచ్చి కశ్మీర్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయాలని షరతులు పెడతానని చరణ్ చెప్పడం విశేషం.
This post was last modified on May 23, 2023 8:48 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…