భారతీయ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లది అరుదైన జోడీ. తండ్రి ఇండియన్ సినిమాలో పీక్స్ను చూస్తే.. ఆయన తనయుడిగా రంగ ప్రవేశం చేసి.. తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చిరు కూడా అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు.
అయినా సరే.. తన తండ్రి ముందు తాను చాలా చిన్నవాడిననే ఫీలవుతాడు చరణ్. తన తండ్రి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా గొప్పగా మాట్లాడతాడు. ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న జీ20 సదస్సుకు భారతీయ సినిమా ప్రతినిధిగా హాజరైన చరణ్.. కశ్మీర్ ప్రత్యేకత, భారతీయ సినిమా విశిష్టత గురించి మాట్లాడుతూనే.. మధ్యలో తన తండ్రి ప్రస్తావన తెచ్చాడు. తనకు ఆయనే స్ఫూర్తి అని చెబుతూ 68 ఏళ్ల వయసులో చిరు సినిమాల కోసం పడుతున్న కష్టాన్ని వివరించాడు.
‘‘నాకు మా నాన్నగారే స్ఫూర్తి. ఆయనతో పాటు షూటింగ్ చూడటం కోసం చిన్నపుడు కశ్మీర్కు వచ్చాను. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని దర్శించాను. ఇప్పుడు జీ20 సదస్సు కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న వయసు 68 ఏళ్లు. ఆయన ప్రస్తుతం నాలుగు సినిమాలకు సంతకం చేశారు. ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఆయనొకరు. రోజూ ఉదయం 5.30కే నిద్ర లేస్తారు. తర్వాత వర్కవుట్ చేస్తారు. ఆపై రోజు వారీ పనికి వెళ్లిపోతారు. 68 ఏళ్ల వయసులోనూ పని పట్ల ఆయన చూపించే నిబద్ధత నాకు స్ఫూర్తినిస్తుంది. మరింత కష్టపడడానికి ప్రేరణగా నిలుస్తుంది’’ అని చరణ్ జీ20 సమ్మిట్లో తన తండ్రికి అదిరే ఎలివేషన్ ఇచ్చాడు.
కశ్మీర్ భూతల స్వర్గం అని.. ఇక్కడ షూటింగ్లు చేసుకోవడానికి అద్భుత అవకాశం ఉందని.. ఒక వేళ తనకు హాలీవుడ్ ఆఫర్లు వస్తే.. ఇండియాకే వచ్చి కశ్మీర్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయాలని షరతులు పెడతానని చరణ్ చెప్పడం విశేషం.
This post was last modified on May 23, 2023 8:48 pm
మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ…
https://www.youtube.com/watch?v=kR4Y4m3FyhU&t=225s హాస్యానికి మారుపేరుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే మీమ్ గాడ్ గా చెప్పుకునే బ్రహ్మానందంకు నట వారసత్వం రూపంలో రాజా…
ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేస్తారు. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందాని ఇరు జట్ల కెప్టెన్లు ఎదురు…
బీజేపీ, బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులు డబుల్ ఇస్మార్ట్ విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అన్నీ సవ్యంగా…
400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో…