కొన్ని సినిమాలకి రిలీజ్ కి ముందే క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఆ సినిమా అప్ డేట్స్ ఫాలో అవుతూ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రేజీ కపుల్ మూవీ ‘మళ్ళీ పెళ్లి’. లివింగ్ రిలేషన్ షిప్ , ముందు భార్యతో గొడవ కారణంగా నరేష్ ఒక టైమ్ లో సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ తో కలిసి విపరీతంగా ట్రోలింగ్ అయ్యారు.
యాబై ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నరేష్ ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి సొంత బేనర్ లో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాడు. వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ వాడుకొని ఎమ్మెస్ రాజు రెండో పెళ్లి కథతో ఈ సినిమా చేశాడు.పైగా సినిమాలో యూత్ కోరుకునే మంచి మసాలా కూడా దట్టించారు రాజు గారు. దీంతో రిలీజ్ కి ముందే ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు. తాజాగా నరేష్ కూడా ఈ విషయం చెప్పారు. ఇందులో నిజం లేకపోలేదు.
‘మళ్ళీ పెళ్లి’ సినిమాకి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో నరేష్ పవిత్ర కథ తెలుసుకొని ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ క్రేజ్ తోనే ఇప్పటికే శాటిలైట్ , డిజిటల్ కూడా భారీ రేటుకి అమ్ముడుపోయాయి. ఇక థియేట్రికల్ పరంగా కూడా మంచి కలెక్షన్ రావడం ఖాయమనిపిస్తుంది. మరి తమ లిప్ లాక్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన పవిత్ర నరేష్ ఈ సినిమాతో ఏ రేంజ్ ఓపెనింగ్ రాబడతారో ? అనే డిస్కషన్ నడుస్తుంది.
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…