కొన్ని సినిమాలకి రిలీజ్ కి ముందే క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఆ సినిమా అప్ డేట్స్ ఫాలో అవుతూ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రేజీ కపుల్ మూవీ ‘మళ్ళీ పెళ్లి’. లివింగ్ రిలేషన్ షిప్ , ముందు భార్యతో గొడవ కారణంగా నరేష్ ఒక టైమ్ లో సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ తో కలిసి విపరీతంగా ట్రోలింగ్ అయ్యారు.
యాబై ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నరేష్ ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి సొంత బేనర్ లో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాడు. వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ వాడుకొని ఎమ్మెస్ రాజు రెండో పెళ్లి కథతో ఈ సినిమా చేశాడు.పైగా సినిమాలో యూత్ కోరుకునే మంచి మసాలా కూడా దట్టించారు రాజు గారు. దీంతో రిలీజ్ కి ముందే ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు. తాజాగా నరేష్ కూడా ఈ విషయం చెప్పారు. ఇందులో నిజం లేకపోలేదు.
‘మళ్ళీ పెళ్లి’ సినిమాకి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో నరేష్ పవిత్ర కథ తెలుసుకొని ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ క్రేజ్ తోనే ఇప్పటికే శాటిలైట్ , డిజిటల్ కూడా భారీ రేటుకి అమ్ముడుపోయాయి. ఇక థియేట్రికల్ పరంగా కూడా మంచి కలెక్షన్ రావడం ఖాయమనిపిస్తుంది. మరి తమ లిప్ లాక్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన పవిత్ర నరేష్ ఈ సినిమాతో ఏ రేంజ్ ఓపెనింగ్ రాబడతారో ? అనే డిస్కషన్ నడుస్తుంది.
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…