కొన్ని సినిమాలకి రిలీజ్ కి ముందే క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఆ సినిమా అప్ డేట్స్ ఫాలో అవుతూ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రేజీ కపుల్ మూవీ ‘మళ్ళీ పెళ్లి’. లివింగ్ రిలేషన్ షిప్ , ముందు భార్యతో గొడవ కారణంగా నరేష్ ఒక టైమ్ లో సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ తో కలిసి విపరీతంగా ట్రోలింగ్ అయ్యారు.
యాబై ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నరేష్ ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి సొంత బేనర్ లో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాడు. వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ వాడుకొని ఎమ్మెస్ రాజు రెండో పెళ్లి కథతో ఈ సినిమా చేశాడు.పైగా సినిమాలో యూత్ కోరుకునే మంచి మసాలా కూడా దట్టించారు రాజు గారు. దీంతో రిలీజ్ కి ముందే ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు. తాజాగా నరేష్ కూడా ఈ విషయం చెప్పారు. ఇందులో నిజం లేకపోలేదు.
‘మళ్ళీ పెళ్లి’ సినిమాకి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో నరేష్ పవిత్ర కథ తెలుసుకొని ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ క్రేజ్ తోనే ఇప్పటికే శాటిలైట్ , డిజిటల్ కూడా భారీ రేటుకి అమ్ముడుపోయాయి. ఇక థియేట్రికల్ పరంగా కూడా మంచి కలెక్షన్ రావడం ఖాయమనిపిస్తుంది. మరి తమ లిప్ లాక్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన పవిత్ర నరేష్ ఈ సినిమాతో ఏ రేంజ్ ఓపెనింగ్ రాబడతారో ? అనే డిస్కషన్ నడుస్తుంది.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…