ప్రేక్షకులు ఊహించని ఓ కాంబో భారీ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారంటే ? మూవీ లవర్స్ కి అంతకంటే సంతోషముండదు. తాజాగా అలాంటి ఓ వార్తే సినిమా అభిమానులను సంబరపెడుతూ ఇది సాధ్యమేనా ? అనిపించేలా చేస్తుంది. విషయంలోకి వెళితే బాలకృష్ణ – శివరాజ్ కుమార్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. శివ రాజ్ కుమార్ ప్రొడక్షన్ లో కన్నడ దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని, దీన్ని రెండు భాగాలుగా తీస్తారని టాక్ వినిపిస్తుంది. మొదటి పార్ట్ లో బాలకృష్ణ -శివ రాజ్ కుమార్ ఉంటారట , రెండో పార్ట్ లో మాత్రం రజినీ కాంత్, బాలయ్య కనిపిస్తారని అంటున్నారు.
తాజాగా శివ రాజ్ కుమార్ బాలయ్య తో మా కాంబోలో సినిమా రానున్నట్లు తెలియజేశాడు. దీంతో ఈ కాంబో సినిమా ఫిక్స్ అని క్లారిటీ వచ్చేసింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో ఎన్టీఆర్ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా బాలయ్య -శివ రాజ్ కుమార్ ఇద్దరు మంచి మిత్రులు. గతంలో బాలయ్య అడగ్గానే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు శివ రాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా శివ రాజ్ కుమార్ హాజరయ్యాడు.
బాలయ్య , శివ రాజ్ కుమార్ కాంబో అయితే ఫిక్సే. కానీ రజినీ కాంత్ , బాలయ్య కాంబో మీద అందరికీ డౌట్స్ కలుగుతున్నాయి. ప్రస్తుతం రజినీ కాంత్ జైలర్ , లాల్ సలాం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘జై భీం’ ఫేమ్ జ్ఞానవేల్ తో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ తో మరో ప్రాజెక్ట్ లైనప్ లో ఉంది. ఈ బిజీ షెడ్యూల్ లో రజినీ ఈ సినిమాకు డేట్స్ ఇస్తారా ? కష్టమే అనిపిస్తుంది. ఒక వేళ రజినీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఈ కాంబో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడమే కాదు సెన్సేషన్ అవుతుంది కూడా.
This post was last modified on May 25, 2023 6:03 am
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…