ప్రేక్షకులు ఊహించని ఓ కాంబో భారీ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారంటే ? మూవీ లవర్స్ కి అంతకంటే సంతోషముండదు. తాజాగా అలాంటి ఓ వార్తే సినిమా అభిమానులను సంబరపెడుతూ ఇది సాధ్యమేనా ? అనిపించేలా చేస్తుంది. విషయంలోకి వెళితే బాలకృష్ణ – శివరాజ్ కుమార్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. శివ రాజ్ కుమార్ ప్రొడక్షన్ లో కన్నడ దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని, దీన్ని రెండు భాగాలుగా తీస్తారని టాక్ వినిపిస్తుంది. మొదటి పార్ట్ లో బాలకృష్ణ -శివ రాజ్ కుమార్ ఉంటారట , రెండో పార్ట్ లో మాత్రం రజినీ కాంత్, బాలయ్య కనిపిస్తారని అంటున్నారు.
తాజాగా శివ రాజ్ కుమార్ బాలయ్య తో మా కాంబోలో సినిమా రానున్నట్లు తెలియజేశాడు. దీంతో ఈ కాంబో సినిమా ఫిక్స్ అని క్లారిటీ వచ్చేసింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో ఎన్టీఆర్ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా బాలయ్య -శివ రాజ్ కుమార్ ఇద్దరు మంచి మిత్రులు. గతంలో బాలయ్య అడగ్గానే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు శివ రాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా శివ రాజ్ కుమార్ హాజరయ్యాడు.
బాలయ్య , శివ రాజ్ కుమార్ కాంబో అయితే ఫిక్సే. కానీ రజినీ కాంత్ , బాలయ్య కాంబో మీద అందరికీ డౌట్స్ కలుగుతున్నాయి. ప్రస్తుతం రజినీ కాంత్ జైలర్ , లాల్ సలాం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘జై భీం’ ఫేమ్ జ్ఞానవేల్ తో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ తో మరో ప్రాజెక్ట్ లైనప్ లో ఉంది. ఈ బిజీ షెడ్యూల్ లో రజినీ ఈ సినిమాకు డేట్స్ ఇస్తారా ? కష్టమే అనిపిస్తుంది. ఒక వేళ రజినీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఈ కాంబో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడమే కాదు సెన్సేషన్ అవుతుంది కూడా.
This post was last modified on May 25, 2023 6:03 am
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…