సీనియర్ నటుడు నరేష్ హీరో వేషాలు వేసి దశాబ్దాలు కావస్తోంది. ఆయన పేరున్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ మంచి మంచివే చేస్తున్నారు కానీ.. తనకంటూ ఒక మార్కెట్ అయితే లేదు. హీరోగా చేసినపుడు కూడా చాలా వరకు కామెడీ పాత్రలే చేశారు. కాబట్టి ఆయనకు మాస్ ఫాలోయింగ్, అభిమాన గణం అంటూ పెద్దగా లేకపోయింది.
90వ దశకంలోనే హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో.. నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయారు. వాటితోనే అలరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న నటుడు.. ఈ వయసులో హీరోగా సినిమా చేయడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. నరేష్తో కొన్నేళ్లుగా కలిసి ప్రయాణం సాగిస్తున్న పవిత్ర లోకేష్ ఇందులో ఆయనకు జోడీగా నటించింది. దాదాపుగా వీరి నిజ జీవిత కథనే ఈ సినిమాలో చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎం.ఎస్.రాజు లాంటి వయసు పైబడ్డ నిర్మాతే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఇలాంటి సినిమాకు యూత్లో క్రేజ్ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాను అనౌన్స్ చేసినపుడు.. నరేష్కు డబ్బులు ఎక్కువై ముచ్చట తీర్చుకుంటున్నారు తప్ప.. ఈ సినిమాను ఎవరు పట్టించుకున్నారు అనుకున్నారు చాలామంది. ఐతే నరేష్ నిజ జీవిత విషయాలతో ముడిపెట్టి కథను అల్లడం వల్ల దీని పట్ల జనాల్లో కొంత ఆసక్తి పుట్టింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్.. ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. రిలీజ్ ముంగిట ప్రమోషన్లను కూడా హోరెత్తించేస్తోంది చిత్ర బృందం.
వేరే సినిమాల ఇంటర్వెల్స్లో ‘మళ్ళీ పెళ్ళి’ ట్రైలర్ ప్రదర్శిస్తుంటే.. జనాల కేరింతలు చూస్తే యూత్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని అర్థమవుతోంది. ఈ నెల 26న రిలీజవుతున్న ‘మళ్ళీ పెళ్ళి’ చూసేందుకు జనం మరీ ఎగబడి థియేటర్లకు వచ్చేస్తారని చెప్పలేం కానీ.. ఉన్నంతలో మంచి ఆక్యుపెన్సీలే రావచ్చని అంచనా వేస్తున్నారు. ‘మేమ్ ఫేమస్’ అనే యూత్ఫుల్ మూవీకి ‘మళ్ళీ పెళ్ళి’ గట్టి పోటీ ఇవ్వొచ్చని అనిపిస్తోంది. ఇలాంటి సినిమాకు ఈమాత్రం క్రేజ్ తీసుకురావడం గొప్ప విషయమే.
This post was last modified on May 22, 2023 6:35 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…