సీనియర్ నటుడు నరేష్ హీరో వేషాలు వేసి దశాబ్దాలు కావస్తోంది. ఆయన పేరున్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ మంచి మంచివే చేస్తున్నారు కానీ.. తనకంటూ ఒక మార్కెట్ అయితే లేదు. హీరోగా చేసినపుడు కూడా చాలా వరకు కామెడీ పాత్రలే చేశారు. కాబట్టి ఆయనకు మాస్ ఫాలోయింగ్, అభిమాన గణం అంటూ పెద్దగా లేకపోయింది.
90వ దశకంలోనే హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో.. నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయారు. వాటితోనే అలరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న నటుడు.. ఈ వయసులో హీరోగా సినిమా చేయడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. నరేష్తో కొన్నేళ్లుగా కలిసి ప్రయాణం సాగిస్తున్న పవిత్ర లోకేష్ ఇందులో ఆయనకు జోడీగా నటించింది. దాదాపుగా వీరి నిజ జీవిత కథనే ఈ సినిమాలో చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎం.ఎస్.రాజు లాంటి వయసు పైబడ్డ నిర్మాతే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఇలాంటి సినిమాకు యూత్లో క్రేజ్ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాను అనౌన్స్ చేసినపుడు.. నరేష్కు డబ్బులు ఎక్కువై ముచ్చట తీర్చుకుంటున్నారు తప్ప.. ఈ సినిమాను ఎవరు పట్టించుకున్నారు అనుకున్నారు చాలామంది. ఐతే నరేష్ నిజ జీవిత విషయాలతో ముడిపెట్టి కథను అల్లడం వల్ల దీని పట్ల జనాల్లో కొంత ఆసక్తి పుట్టింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్.. ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. రిలీజ్ ముంగిట ప్రమోషన్లను కూడా హోరెత్తించేస్తోంది చిత్ర బృందం.
వేరే సినిమాల ఇంటర్వెల్స్లో ‘మళ్ళీ పెళ్ళి’ ట్రైలర్ ప్రదర్శిస్తుంటే.. జనాల కేరింతలు చూస్తే యూత్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని అర్థమవుతోంది. ఈ నెల 26న రిలీజవుతున్న ‘మళ్ళీ పెళ్ళి’ చూసేందుకు జనం మరీ ఎగబడి థియేటర్లకు వచ్చేస్తారని చెప్పలేం కానీ.. ఉన్నంతలో మంచి ఆక్యుపెన్సీలే రావచ్చని అంచనా వేస్తున్నారు. ‘మేమ్ ఫేమస్’ అనే యూత్ఫుల్ మూవీకి ‘మళ్ళీ పెళ్ళి’ గట్టి పోటీ ఇవ్వొచ్చని అనిపిస్తోంది. ఇలాంటి సినిమాకు ఈమాత్రం క్రేజ్ తీసుకురావడం గొప్ప విషయమే.
This post was last modified on May 22, 2023 6:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…