ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మళ్ళీ పెళ్లి ప్రమోషన్ కోసం నరేష్ ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నారు. పైకి ఎన్ని చెబుతున్నా ఇది ఆయన నాలుగో మ్యారేజ్ బయోపిక్ అని అందరికీ అర్ధమవుతూనే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పవిత్ర లోకేష్ తో పబ్లిక్ గా నరేష్ చేసిన సాంగ్ రొమాన్స్ నెక్స్ట్ లెవెలని చెప్పొచ్చు. మాములుగా వయసులో ఉన్న హీరో హీరోయిన్లే ఇలా స్టేజి మీద కెమిస్ట్రీని చూపించుకోరు. ఎంత ఉన్నా అది కేవలం స్క్రీన్ కే పరిమితం. కానీ ఈ జంట మాత్రం ఓ అడుగు ముందుకేసి ఇందులోనూ స్పెషలని ఋజువు చేసుకున్నారు. వేడుక గ్రాండ్ గానే చేశారు.
ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ తన మాటల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ తనను అంగీకరించారని చెప్పిన మాట విని అందరూ షాక్ అయ్యారు. నిజానికి ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ అభిమానులందరూ నరేష్ కు మద్దతుదారులు కాదు. ఆ మాటకొస్తే వాళ్ళు సుధీర్ బాబునే సీరియస్ గా తీసుకోవడం లేదు. వాళ్ళ లెక్కలో కృష్ణగారి తర్వాత మహేష్ అంతే. ఆ తర్వాత గౌతమ్ వస్తాడు. అలాంటప్పుడు నరేష్ మీద ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపించే అవకాశం లేనప్పుడు ఇక పవిత్రని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అంటూ ఏమీ ఉండదు.
కానీ ఇలా మాటల గేలం వల్ల మళ్ళీ పెళ్లి సినిమాకే ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే ఫస్ట్ డే ఎక్కువైనా తక్కువైనా ఆ క్రెడిట్ మొత్తం నరేష్ పవిత్రలకే చెందుతుంది తప్ప ఇంకొకరికి కాదు. అలాంటప్పుడు ఇంటర్వ్యూలలో కృష్ణ విజయనిర్మల గారి పేర్లను అదే పనిగా ప్రస్తావించడం వర్కౌట్ అయ్యేది కాదు. ఆ మాటకొస్తే మహేష్ ఏ సందర్భంలోనూ నరేష్ పవిత్రలతో క్లోజ్ గా మాట్లాడుతున్న ఫోటోలు కానీ వీడియోల కానీ మచ్చుకు కూడా కనిపించవు. మొత్తానికి ఇంకో అయిదు రోజులు నరేష్ కపుల్ ఇలా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండటం ఖాయం.
This post was last modified on May 22, 2023 12:14 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…