ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మళ్ళీ పెళ్లి ప్రమోషన్ కోసం నరేష్ ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నారు. పైకి ఎన్ని చెబుతున్నా ఇది ఆయన నాలుగో మ్యారేజ్ బయోపిక్ అని అందరికీ అర్ధమవుతూనే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పవిత్ర లోకేష్ తో పబ్లిక్ గా నరేష్ చేసిన సాంగ్ రొమాన్స్ నెక్స్ట్ లెవెలని చెప్పొచ్చు. మాములుగా వయసులో ఉన్న హీరో హీరోయిన్లే ఇలా స్టేజి మీద కెమిస్ట్రీని చూపించుకోరు. ఎంత ఉన్నా అది కేవలం స్క్రీన్ కే పరిమితం. కానీ ఈ జంట మాత్రం ఓ అడుగు ముందుకేసి ఇందులోనూ స్పెషలని ఋజువు చేసుకున్నారు. వేడుక గ్రాండ్ గానే చేశారు.
ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ తన మాటల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ తనను అంగీకరించారని చెప్పిన మాట విని అందరూ షాక్ అయ్యారు. నిజానికి ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ అభిమానులందరూ నరేష్ కు మద్దతుదారులు కాదు. ఆ మాటకొస్తే వాళ్ళు సుధీర్ బాబునే సీరియస్ గా తీసుకోవడం లేదు. వాళ్ళ లెక్కలో కృష్ణగారి తర్వాత మహేష్ అంతే. ఆ తర్వాత గౌతమ్ వస్తాడు. అలాంటప్పుడు నరేష్ మీద ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపించే అవకాశం లేనప్పుడు ఇక పవిత్రని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అంటూ ఏమీ ఉండదు.
కానీ ఇలా మాటల గేలం వల్ల మళ్ళీ పెళ్లి సినిమాకే ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే ఫస్ట్ డే ఎక్కువైనా తక్కువైనా ఆ క్రెడిట్ మొత్తం నరేష్ పవిత్రలకే చెందుతుంది తప్ప ఇంకొకరికి కాదు. అలాంటప్పుడు ఇంటర్వ్యూలలో కృష్ణ విజయనిర్మల గారి పేర్లను అదే పనిగా ప్రస్తావించడం వర్కౌట్ అయ్యేది కాదు. ఆ మాటకొస్తే మహేష్ ఏ సందర్భంలోనూ నరేష్ పవిత్రలతో క్లోజ్ గా మాట్లాడుతున్న ఫోటోలు కానీ వీడియోల కానీ మచ్చుకు కూడా కనిపించవు. మొత్తానికి ఇంకో అయిదు రోజులు నరేష్ కపుల్ ఇలా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండటం ఖాయం.
This post was last modified on May 22, 2023 12:14 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…