ఈ రోజుల్లో పెళ్లి అంటే చిన్న స్థాయి వాళ్లకు కూడా లక్షల్లోనే ఖర్చవుతోంది. ఇక కొంచెం పెద్ద రేంజిలో ఉన్న వాళ్లయితే మంచి నీళ్ల ప్రాయంగా కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఫిలిం సెలబ్రెటీలంటే ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి కేవలం లక్షన్నర రూపాయల్లో అయిపోయిందంటే షాకవ్వక తప్పదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మహేష్ బాబు సరసన ‘అతిథి’ లాంటి భారీ చిత్రంలో నటించిన అమృతారావు.
బాలీవుడ్లో ‘వివాహ్’ సహా పలు పేరున్న చిత్రాల్లో నటించిన ఈ ముంబయి భామ.. 2016లో ఆర్జే అన్మోల్ అనే కుర్రాడిని పెళ్లాడింది. ఆమె వేరే సెలబ్రెటీల్లా ఆడంబరాలకు పోకుండా సింపుల్గా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి అయిన ఖర్చు కేవలం 1.5 లక్షన్నర రూపాయలే అనే విషయాన్ని అమృత తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
చాలా కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నేను, అన్మోల్ పెళ్లి చేసుకున్నాం. ఈ తంతు కోసం మేం ఖర్చు పెట్టింది లక్షన్నర రూపాయలే. పెళ్లి బట్టలు, ప్రయాణ ఖర్చులు, కళ్యాణ వేదిక, భోజనాలు.. ఇవన్నీ కూడా ఆ డబ్బుతోనే సర్దుకున్నాం. నేను ధరించిన పెళ్లి చీర ధర కేవలం 3 వేల రూపాయలు. కళ్యాణ వేదికకు కట్టిన రెంట్ రూ.11 వేలు. మిగతా వాటికి కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు. అంతా లక్షన్నర బడ్జెట్లోనే పూర్తయింది’’ అని అమృత తెలిపింది.
2002లో ‘అబ్కే బరాస్’ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అయిన అమృత.. హిందీలో దాదాపు పాతిక సినిమాల దాకా చేసింది. దక్షిణాదిన ఆమె నటించిన సినిమా ‘అతిథి’ మాత్రమే. రేడియో జాకీ అయిన అన్మోల్తో ఆమె ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి.. చివరికి 2016లో అతణ్ని పెళ్లాడింది. వీరికి వీర్ అనే బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత అమృత సినిమాలకు దూరం అయింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…