స్వంతంగా నిర్మించి మరీ రావణాసుర రూపంలో షాక్ తిన్న రవితేజకు ధమాకా, వాల్తేరు వీరయ్య ఇచ్చిన కిక్కు కొంత తగ్గిపోయింది. అందుకే తన ఆశలన్నీ టైగర్ నాగేశ్వరరావు మీద పెట్టుకున్నాడు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా అక్టోబర్ 20న విజయదశమి కానుకగా విడుదల కానుంది. అదే సమయంలో బాలకృష్ణ, విజయ్ ల సినిమాలు ఉన్నప్పటికీ మాస్ మహారాజా పోటీకి సై అంటున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ని నిర్మాతలు ప్లాన్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తోంది.
అయిదు బాషల నుంచి అయిదుగురు స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించి 24న రాజమండ్రిలో ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి మరీ లాంచ్ చేయబోతున్నారు. అంటే ఇదొక చిన్నపాటి టీజర్ లా ఉంటుందన్న మాట. తెలుగులో వెంకటేష్, కన్నడలో శివ రాజ్ కుమార్, హిందీలో జాన్ అబ్రహం. తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లు రవితేజ కోసం గొంతు కలిపేందుకు ఎస్ చెప్పి ఆ పని పూర్తి చేశారు. ఒక్కొక్కరిని ప్రత్యేకంగా స్టూడియోకు తీసుకెళ్లడం దగ్గరి నుంచి రికార్డింగ్ పూర్తి చేయించే దాకా అంతా వీడియో రూపంలో షూట్ చేయించి ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చారు.
ఇంత సెటప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ పబ్లిసిటీ స్పీడ్ ని ఇంకా పెంచబోతున్నారు. దశాబ్దాల క్రితం స్టువర్ట్ పురం ప్రాంతంలో పేరుమోసిన గజదొంగగా పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఉన్న నాగేశ్వరరావు అనే వ్యక్తి కథ ఇది. ఆషామాషీ చోరీ చేసే వ్యక్తి కాదితను. గూస్ బంప్స్ ఇచ్చే ఎన్నో ఘట్టాల్లో భాగమయ్యాడు. అందుకే ఈ కథను ప్రెజెంట్ చేయబోతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కి భిన్నంగా ఈ టైగర్ కథ ఉండబోతోంది. రైలు దోపిడీలు, దొరగారి ఇళ్లలో చోరీలు, లూటీలు ఇలా ఎన్నో చేసిన ఇతను హీరో ఎందుకు అయ్యాడనేదే ఈ కల్పితాన్ని జోడించిన బయోపిక్ లో చూపించబోతున్నారు.
This post was last modified on May 22, 2023 6:55 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…