విలన్లుగా భయపెట్టిన వాళ్లు తర్వాతి రోజుల్లో కమెడియన్లుగా అలరించిన సందర్భాలున్నాయి. కానీ కామెడీతో నవ్వించిన వాళ్లు విలన్లుగా మారడం అరుదు. అలా మారినా ప్రేక్షకుల ఆమోదం పొందడం కష్టమే. కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన సునీల్ కొన్ని విజయాలందుకున్నాడు కానీ.. ఆ తర్వాత అతడికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మళ్లీ కామెడీ రోల్స్ చేస్తే అవేవీ సరిగా పండలేదు.
దీంతో రూటు మార్చి విలనీ మీద దృష్టిసారించాడతను. రవితేజ హీరోగా నటించిన ‘డిస్కో రాజా’లో అతను విలన్ పాత్రతో పెద్ద షాకిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పాత్ర విలన్ అని చివర్లో తెలుస్తుంది. ఐతే ఆ ట్విస్టు చూసి షాకవ్వడం పోయి జనాలు నవ్వుకున్నారు.
సునీల్ను విలన్ పాత్రలో అస్సలు ఊహించుకోలేకపోయారు జనాలు. ఆ పాత్రను సినిమాలో ప్రెజెంట్ చేసిన విధానం కూడా ఏమీ బాగా లేకపోయింది. అలా అని సునీల్ ఏమీ తన ప్రయత్నం ఆపేయలేదు. మళ్లీ విలన్గా ట్రై చేశాడు. కానీ ఈసారి మాత్రం అది వర్కవుటయ్యేలాగే కనిపిస్తోంది.
తాజాగా రిలీజైన ‘కలర్ ఫొటో’ టీజర్లో సునీల్ విలన్గా ఆకట్టుకున్నాడు. నెగెటివ్ రోల్లో మంచి ఇంపాక్టే చూపించాడు. అతడి లుక్స్, డైలాగ్ అన్నీ బాగానే కుదిరాయి. సినిమాలో ఈ పాత్ర ఏ మేర పండుతుందన్నది పక్కన పెడితే.. ముందు సునీల్ను విలన్గా యాక్సెప్ట్ చేసేలా ప్రేక్షకులకు ఒక ఫీలింగ్ తీసుకురావడంలో టీజర్ విజయవంతమైంది. సినిమాలో సునీల్ క్యారెక్టర్ అంచనాలకు తగ్గట్లుంటే.. అతను ఇకపై నెగెటివ్ రోల్స్కు షిఫ్ట్ అయిపోవచ్చేమో.
This post was last modified on August 7, 2020 4:31 pm
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…