Movie News

హుందాతనాన్ని చాటుకున్న రష్మిక

ఈ సోషల్ మీడియా కాలంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నపుడు సినీ జనాలు జాగ్రత్తగా.. ఆచితూచి మాట్లాడాల్సిందే. చిన్న మాట తూలినా దాన్ని వలువలు చిలువలు చేసేస్తారు సోషల్ మీడియా జనాలు. కొన్నిసార్లు సెలబ్రెటీలే తప్పు మాట్లాడి నాలుక్కరుచుకుంటే.. కొన్ని సందర్భాల్లో వారి మాటల్లో తప్పేమీ లేకున్నా.. భూతద్దం పెట్టి చూసే జనాలు వివాదాస్పదంగా మారుస్తుంటారు.

ఇటీవల తెలుగు అమ్మాయే అయిన తమిళ నటి ఐశ్వర్య రాజేష్.. ‘పుష్ఫ’లో శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటవుతుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం.. తానైతే శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే బాగా చేసేదాన్నని ఐశ్వర్య వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ హర్టయి ఐశ్వర్యను టార్గెట్ చేశారు. చాలా సున్నితంగా కనిపిస్తూ, అంతే సున్నితంగా మాట్లాడే ఐశ్వర్య.. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఆలస్యం చేయకుండా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేసింది.

రష్మికను తక్కువ చేసేలా తానేం మాట్లాడలేదని.. ఆమె పట్ల తనకెంతో గౌరవం ఉందని.. తనకు శ్రీవల్లి పాత్ర నచ్చిందని, తనకా పాత్ర బాగా సూటవుతుందని మాత్రమే అన్నానని ఆమె ఈ నోట్‌లో పేర్కొంది. ఈ వివాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న రష్మిక.. ఆ నోట్ మీద ట్విట్టర్లో స్పందించింది. ‘‘హాయ్ లవ్.. ఇది నేను ఇప్పుడే చూశా. నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మన గురించి మనం ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.

నాకు నీ పట్ల ప్రేమ, గౌరవ భావాలు మాత్రమే ఉన్నాయి. నీ కొత్త సినిమా ఫర్హానాకు నా శుభాభినందనలు’’ అని హుందాగా మాట్లాడింది రష్మిక. తన వ్యాఖ్యలపై ఐశ్వర్య వివరణ ఇచ్చిన తీరు.. దానికి రష్మిక స్పందించిన వైనం రెండూ కూడా హుందాగానే  ఉండటంతో వాళ్లిద్దరినీ నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప-2’తో పాటు తెలుగులో మరో రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. ఐశ్వర్య తమిళంలో మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

This post was last modified on May 19, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

22 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago