ఈ సోషల్ మీడియా కాలంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నపుడు సినీ జనాలు జాగ్రత్తగా.. ఆచితూచి మాట్లాడాల్సిందే. చిన్న మాట తూలినా దాన్ని వలువలు చిలువలు చేసేస్తారు సోషల్ మీడియా జనాలు. కొన్నిసార్లు సెలబ్రెటీలే తప్పు మాట్లాడి నాలుక్కరుచుకుంటే.. కొన్ని సందర్భాల్లో వారి మాటల్లో తప్పేమీ లేకున్నా.. భూతద్దం పెట్టి చూసే జనాలు వివాదాస్పదంగా మారుస్తుంటారు.
ఇటీవల తెలుగు అమ్మాయే అయిన తమిళ నటి ఐశ్వర్య రాజేష్.. ‘పుష్ఫ’లో శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటవుతుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం.. తానైతే శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే బాగా చేసేదాన్నని ఐశ్వర్య వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ హర్టయి ఐశ్వర్యను టార్గెట్ చేశారు. చాలా సున్నితంగా కనిపిస్తూ, అంతే సున్నితంగా మాట్లాడే ఐశ్వర్య.. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఆలస్యం చేయకుండా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేసింది.
రష్మికను తక్కువ చేసేలా తానేం మాట్లాడలేదని.. ఆమె పట్ల తనకెంతో గౌరవం ఉందని.. తనకు శ్రీవల్లి పాత్ర నచ్చిందని, తనకా పాత్ర బాగా సూటవుతుందని మాత్రమే అన్నానని ఆమె ఈ నోట్లో పేర్కొంది. ఈ వివాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న రష్మిక.. ఆ నోట్ మీద ట్విట్టర్లో స్పందించింది. ‘‘హాయ్ లవ్.. ఇది నేను ఇప్పుడే చూశా. నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మన గురించి మనం ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.
నాకు నీ పట్ల ప్రేమ, గౌరవ భావాలు మాత్రమే ఉన్నాయి. నీ కొత్త సినిమా ఫర్హానాకు నా శుభాభినందనలు’’ అని హుందాగా మాట్లాడింది రష్మిక. తన వ్యాఖ్యలపై ఐశ్వర్య వివరణ ఇచ్చిన తీరు.. దానికి రష్మిక స్పందించిన వైనం రెండూ కూడా హుందాగానే ఉండటంతో వాళ్లిద్దరినీ నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప-2’తో పాటు తెలుగులో మరో రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. ఐశ్వర్య తమిళంలో మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
This post was last modified on May 19, 2023 3:49 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…