పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల టైంలో సినిమాలకు టాటా చెప్పేస్తున్నట్లు ప్రకటించడం అభిమానులకు పెద్ద షాక్. కానీ రెండేళ్ల విరామం తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి సినిమాల్లోకి రావడంతో హమ్మయ్య అనుకున్నారు. పవన్ రీఎంట్రీ ఇవ్వడం సంతోషమే కానీ.. ఆయన తమ ఆకాంక్షలకు తగ్గ సినిమాలు చేయట్లేదన్న అసంతృప్తి అభిమానుల్లో ఉంది. పవన్ వరుసబెట్టి రీమేక్ సినిమాలు చేస్తుండటం..
వాటిలోనూ మాస్ మసాలా అంశాలు తక్కువ ఉండటం వారికి నిరాశ కలిగిస్తోంది. ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న వార్త బయటికి వచ్చినపుడు అభిమానులు షాక్కు గురయ్యారు. ఆ సినిమా వద్దే వద్దు అంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు చేశారు. కానీ తర్వాత తర్వాత వారి ఆలోచన మారిపోయింది.
ఆ కథకు కమర్షియల్ టచ్ ఇచ్చి.. పవన్ను వీలైనంత మాస్గా చూపించడానికి జరిగిన ప్రయత్నంతో అభిమానులు సంతృప్తి చెందారు. చివరికి ఆ సినిమాను బాగానే ఓన్ చేసుకున్నారు. ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. మళ్లీ రీమేకా.. అది కూడా మాస్ మసాలా అంశాలు లేని సినిమానా అంటూ నిట్టూర్చారు. కానీ చివరికి ఆ సినిమాను కూడా ఓన్ చేసుకున్నారు. అంతిమంగా అది కూడా అభిమానులను శాటిస్ఫై చేసింది.
ఇప్పుడిక ‘వినోదియ సిత్తం’ రీమేక్ విషయానికి వస్తే.. ఈ సినిమా వద్దే వద్దంటూ గోల గోల చేశారు పవన్ ఫ్యాన్స్. ఒక దశలో అభిమానుల వేదనను అర్థం చేసుకుని ఈ సినిమాను ఆపేసినట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత సీన్ మారింది. సినిమా పట్టాలెక్కింది. అంతవరకు సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు.. ఈ సినిమా షూట్ మొదలైనపుడు సైలెంట్ అయ్యారు.
ఈ సినిమాకు ‘బ్రో’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలొస్తే ఇదేం టైటిల్ అన్నారు. కానీ చివరికి ఈ టైటిలే ప్రకటిస్తే సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తే.. ఒరిజినల్తో పోలిస్తే దీనికీ బాగానే కమర్షియల్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. యథాప్రకారం అభిమానులు ఈ సినిమాను ఓన్ చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఆటోమేటిగ్గా రిలీజ్ టైంకి ఈ సినిమాకు కూడా మంచి క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. పవన్లో ఉన్న మ్యాజిక్.. ఆయన అభిమానుల్లో ఉండే ఉత్సాహం అలాంటిది మరి.
This post was last modified on May 19, 2023 3:43 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…