పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల టైంలో సినిమాలకు టాటా చెప్పేస్తున్నట్లు ప్రకటించడం అభిమానులకు పెద్ద షాక్. కానీ రెండేళ్ల విరామం తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి సినిమాల్లోకి రావడంతో హమ్మయ్య అనుకున్నారు. పవన్ రీఎంట్రీ ఇవ్వడం సంతోషమే కానీ.. ఆయన తమ ఆకాంక్షలకు తగ్గ సినిమాలు చేయట్లేదన్న అసంతృప్తి అభిమానుల్లో ఉంది. పవన్ వరుసబెట్టి రీమేక్ సినిమాలు చేస్తుండటం..
వాటిలోనూ మాస్ మసాలా అంశాలు తక్కువ ఉండటం వారికి నిరాశ కలిగిస్తోంది. ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న వార్త బయటికి వచ్చినపుడు అభిమానులు షాక్కు గురయ్యారు. ఆ సినిమా వద్దే వద్దు అంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు చేశారు. కానీ తర్వాత తర్వాత వారి ఆలోచన మారిపోయింది.
ఆ కథకు కమర్షియల్ టచ్ ఇచ్చి.. పవన్ను వీలైనంత మాస్గా చూపించడానికి జరిగిన ప్రయత్నంతో అభిమానులు సంతృప్తి చెందారు. చివరికి ఆ సినిమాను బాగానే ఓన్ చేసుకున్నారు. ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. మళ్లీ రీమేకా.. అది కూడా మాస్ మసాలా అంశాలు లేని సినిమానా అంటూ నిట్టూర్చారు. కానీ చివరికి ఆ సినిమాను కూడా ఓన్ చేసుకున్నారు. అంతిమంగా అది కూడా అభిమానులను శాటిస్ఫై చేసింది.
ఇప్పుడిక ‘వినోదియ సిత్తం’ రీమేక్ విషయానికి వస్తే.. ఈ సినిమా వద్దే వద్దంటూ గోల గోల చేశారు పవన్ ఫ్యాన్స్. ఒక దశలో అభిమానుల వేదనను అర్థం చేసుకుని ఈ సినిమాను ఆపేసినట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత సీన్ మారింది. సినిమా పట్టాలెక్కింది. అంతవరకు సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు.. ఈ సినిమా షూట్ మొదలైనపుడు సైలెంట్ అయ్యారు.
ఈ సినిమాకు ‘బ్రో’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలొస్తే ఇదేం టైటిల్ అన్నారు. కానీ చివరికి ఈ టైటిలే ప్రకటిస్తే సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తే.. ఒరిజినల్తో పోలిస్తే దీనికీ బాగానే కమర్షియల్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. యథాప్రకారం అభిమానులు ఈ సినిమాను ఓన్ చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఆటోమేటిగ్గా రిలీజ్ టైంకి ఈ సినిమాకు కూడా మంచి క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. పవన్లో ఉన్న మ్యాజిక్.. ఆయన అభిమానుల్లో ఉండే ఉత్సాహం అలాంటిది మరి.
This post was last modified on May 19, 2023 3:43 pm
ఫొటోల పిచ్చి అనండి.. ప్రచార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చేజేతులా చేసుకున్న వ్యవహారం ఇప్పుడు పీకల…
నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతున్న సమయంలో గత ఏడాది జగన్ సర్కారు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కీలక నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన బరిలో ఉన్న…
మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…