పవర్ స్టార్ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయకపోయినా కేవలం ఆ బ్రాండ్ తోనే కంటెంట్ తో సంబంధం లేకుండా కోట్ల ఓపెనింగ్స్ ధారాళంగా వస్తాయి. అలా అని పబ్లిసిటీని నిర్మాతలు లైట్ తీసుకోరు. ఎన్నడూ లేనిది ఒకేసారి నాలుగు సినిమాలను సెట్లపై ఉంచి ఊపిరి సలపంత బిజీగా ఉన్న పవన్ ఇవాళ్టి నుంచి ఓజి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి చిన్న షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు.
హరిహర వీరమల్లు బాలన్స్ ని వచ్చే నెల నుంచి ప్లాన్ చేయబోతున్నారు. ఇవాళ టైటిల్ రివీల్ చేయబోతున్న వినోదయ సితం రీమేక్ కి డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది ఒక్క చివరి దానికి తప్ప దేనికీ రిలీజ్ డేట్లు ఫిక్స్ కాలేదు. కానీ ఇటు పక్క డివివి దానయ్య అటు వైపు మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరూ ఇద్దరే రేంజ్ లో ట్విట్టర్ ని వేదికగా చేసుకుని షూటింగ్ స్పాట్ నుంచే ఎడతెగని అప్డేట్స్ ఇస్తున్నారు.
ఓజి ఫోటోలు ఇలా వదలడం ఆలస్యం అలా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ కు సంబంధించి తీసిన కొన్ని సీన్లతో టీజర్ కట్ చేసి సంచలనం సృష్టిస్తే తాజాగా బ్రో(ఇదే టైటిల్ కన్ఫర్మ్ కావొచ్చు) కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగి ఇవాళ సాయంత్రం 4కి వదలబోయే ఫస్ట్ లుక్ గురించి భారీ హైప్ ఇస్తోంది. గతంలో ఇంత యాక్టివ్ గా ఏ పవన్ నిర్మాతలు లేరన్నది వాస్తవం.
అంతెందుకు త్రివిక్రమ్ ఆధ్వర్యంలో నడిచే హారికా హాసిని సంస్థ సైతం అజ్ఞాతవాసి టైంలో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండలేక నానా మాటలు పడింది. భీమ్లా నాయక్ సమయంలో సితార నాగవంశీ చొరవ తీసుకోవడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం డివివి, మైత్రి, పీపుల్స్ మీడియా ముగ్గురు నువ్వా నేనా అనే రేంజ్ లో ఇలా ప్రమోషన్లు చేసుకోవడం అనూహ్యం. బాలన్స్ ఉన్న ఏఎం రత్నం ఒక్కరే రంగంలోకి దిగితే పవన్ ఫ్యాన్స్ కి ఆన్ లైన్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఖాయమే.
This post was last modified on May 18, 2023 12:44 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…