కరోనా వైరస్ విజృంభణతో అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోతే… ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మాత్రం అన్నిటికంటే ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంది. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాణం అంతా యూరప్లోనే జరగాల్సి వుంది. లాక్డౌన్ నాటికి యూరప్లో కరోనా వీర విజృంభణ చేస్తోంది. దాంతో ఇప్పట్లో విదేశీయులను యూరప్లో అడుగుపెట్టనివ్వరనే ప్రచారం జరిగింది. దాంతో ఈ చిత్రం షూటింగ్ ఎలా చేయాలా అంటూ నిర్మాతలు తలలు పట్టుకున్నారు.
ఇక్కడే సెట్స్ వేసి వీలయినంత షూటింగ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియాలో సిట్యువేషన్ మరీ దారుణంగా వుంటే, యూరప్ పొజిషన్ బెటర్ అయింది. కనుక రాధేశ్యామ్ బృందం అక్కడ షూటింగ్ చేయడం కోసం పర్మిషన్స్ గట్రా తెచ్చుకునే పనిలో వుంది. అన్నీ ఓకే అయిపోతే సెప్టెంబర్లో అక్కడకు తక్కువ మంది బృందంతో వెళ్లి షూటింగ్ మొదలు పెట్టాలని రాధేశామ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
యూరప్లో ఒక షెడ్యూల్ షూటింగ్ బాకీ వున్న నితిన్ సినిమా ‘రంగ్ దే’ బృందం కూడా అక్టోబర్లో అక్కడకు చేరుకుని షూటింగ్ ముగించుకోవాలని చూస్తోంది. చూస్తోంటే లోకల్గా షూట్ చేయాల్సిన సినిమాలే ఆలస్యంగా సెట్స్కి వెళ్లేలా వున్నాయి.
This post was last modified on August 7, 2020 12:30 am
కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న…
కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద…
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…