కరోనా వైరస్ విజృంభణతో అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోతే… ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మాత్రం అన్నిటికంటే ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంది. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాణం అంతా యూరప్లోనే జరగాల్సి వుంది. లాక్డౌన్ నాటికి యూరప్లో కరోనా వీర విజృంభణ చేస్తోంది. దాంతో ఇప్పట్లో విదేశీయులను యూరప్లో అడుగుపెట్టనివ్వరనే ప్రచారం జరిగింది. దాంతో ఈ చిత్రం షూటింగ్ ఎలా చేయాలా అంటూ నిర్మాతలు తలలు పట్టుకున్నారు.
ఇక్కడే సెట్స్ వేసి వీలయినంత షూటింగ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియాలో సిట్యువేషన్ మరీ దారుణంగా వుంటే, యూరప్ పొజిషన్ బెటర్ అయింది. కనుక రాధేశ్యామ్ బృందం అక్కడ షూటింగ్ చేయడం కోసం పర్మిషన్స్ గట్రా తెచ్చుకునే పనిలో వుంది. అన్నీ ఓకే అయిపోతే సెప్టెంబర్లో అక్కడకు తక్కువ మంది బృందంతో వెళ్లి షూటింగ్ మొదలు పెట్టాలని రాధేశామ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
యూరప్లో ఒక షెడ్యూల్ షూటింగ్ బాకీ వున్న నితిన్ సినిమా ‘రంగ్ దే’ బృందం కూడా అక్టోబర్లో అక్కడకు చేరుకుని షూటింగ్ ముగించుకోవాలని చూస్తోంది. చూస్తోంటే లోకల్గా షూట్ చేయాల్సిన సినిమాలే ఆలస్యంగా సెట్స్కి వెళ్లేలా వున్నాయి.
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…