ఒక హీరో హీరోయిన్ కలిసి నటించిన సినిమా హిట్ కాకపోయినా.. వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా దగ్గరై జంటగా మారిన ఉదంతాలు సినీ రంగంలో ఉన్నాయి. మహేష్ బాబు, నమ్రత జోడీ వంశీ అనే డిజాస్టర్ మూవీ మేకింగ్ టైంలో ఒకరికొకరు దగ్గరై తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాగే టాలీవుడ్లో మరో జంట ఒక్కటవబోతున్నట్లుగా చాన్నాళ్ల నుంచి చర్చ జరుగుతోంది.
మిస్టర్, అంతరిక్షం లాంటి ఫ్లాప్ సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటిదాకా వీళ్లిద్దరూ దీని గురించి ఓపెన్ అయింది లేదు. ఒక దశలో ఇద్దరూ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. తన కొడుక్కి అతి త్వరలో పెళ్లి చేయబోతున్నట్లు నాగబాబు చెబుతున్నాడు కానీ.. ఆ ఘడియలైతే ఇంకా రాలేదు.
ఐతే ఇప్పుడు వరుణ్, లావణ్య ప్రేమాయణం మరోసారి హాట్ టాపిక్గా మారింది. వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారని.. ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కూడా కుదిరిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో వరుణ్, లావణ్యలకు నిశ్చితార్థం కూడా జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.
లావణ్య.. మెగా ఫ్యామిలీలో జరిగిన కొన్ని వేడుకల్లో కనిపించడంతో వరుణ్కు ఆమెకు మధ్య ఏదో ఉందనే గుసగుసలు మొదలయ్యాయి. కానీ వరుణ్, లావణ్య కలిసి అయితే బయట ఎక్కడా కనిపించలేదు. వీరి మధ్య ఏమీ లేదని కొందరు కొట్టిపడేస్తున్నా.. తరచుగా ఈ జంట గురించి రూమర్లు అయితే ఆగట్లేదు. మరి ఈసారి ఏకంగా ఎంగేజ్మెంట్ అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 16, 2023 11:44 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…