ప్రియాంక చోప్రా ఇప్పుడు ఒక హాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుని ఇంటర్నేషనల్ సినిమాలు, సిరీస్ల్లో అవకాశాలు దక్కించుకుని గ్లోబల్ స్టార్ అయి ఉండొచ్చు. కానీ ఆమె ఒకప్పుడు సగటు బాలీవుడ్ హీరోయినే. తెలుగులో ఓ చిన్న సినిమాలో ఛాన్సొస్తే అందులోనూ నటించిందామె. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు కూడా నోచుకోలేదు. అలాంటి హీరోయిన్.. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లతో ప్రశంసలు దక్కించుకుని.. ‘ఆస్కార్’ పురస్కారాల్లో కూడా సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూడనే లేదట.
రాజమౌళి తెలుగు వాడని.. అందులో నటించిన హీరోలు కూడా తెలుగు వాళ్లని కూడా తెలిసి గతంలో ఆమె ‘ఆర్ఆర్ఆర్’ను తమిళ సినిమా అని పేర్కొని విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడేమో తాను ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదని చెప్పడం చర్చనీయాంశమైంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రియాంక చూసినా చూడకపోయినా ఓకే కానీ.. చూడలేదు అన్నాక అందుకు కారణం చెప్పిన కారణమే సిల్లీగా ఉంది.
తనకు ఈ సినిమా చూసే సమయం దొరకలేదని ఆమె అంది. తాను నిజానికి సినిమాలు పెద్దగా చూడనని.. ఇంట్లో ఖాళీగా ఉన్నపుడు టీవీ షోలు చూస్తానని తర్వాత ఆమె కవరప్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ గత ఏడాది కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే.
పైగా అందులో ఆలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా నటించారు. రామ్ చరణ్ ఆమెకు ఒకప్పుడు కోస్టార్ కూడా. అలాంటి సినిమాను ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న ప్రియాంక చూడకపోవడం.. అందుకు కారణం తనకు టైం లేదని చెప్పడం మరీ అతిగా అనిపిస్తోంది జనాలకు. కనీసం మూడు గంటల సమయం కూడా ఈ సినిమాకు కేటాయించలేని స్థాయిలో ఉన్నావా.. హాలీవుడ్ హీరోయిన్ అయిపోయావనే బిల్డప్పా అంటూ నెటిజన్లు ఆమె మీద కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on May 16, 2023 7:33 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…