కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చూసి.. తెలుగు సినిమా వెలిగిపోతోందని, మన సినిమా గ్లోబల్ అయిపోయిందని తెగ సంబర పడిపోతుంటాం కానీ.. ఓవరాల్గా మన సినిమాల సక్సెస్ రేట్ ఏమంత పెరగలేదు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకూ ఆ రేట్ పడిపోతోంది. ప్రేక్షకులకు ప్రత్యామ్నాయ వినోదం పెరిగిపోయి.. పెద్ద కాన్వాస్ ఉన్న భారీ చిత్రాలకు మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. మామూలు చిత్రాల్లో సూపర్ అనిపించుకుంటే తప్ప సినిమాలు థియేట్రికల్ సక్సెస్ రుచి చూడట్లేదు.
దీంతో నిర్మాతల పరిస్థితి రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో తపనతో, రాజీ లేకుండా సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లకు చేదు అనుభవాలు తప్పట్లేదు. శ్రీనివాస్ చిట్టూరి అనే మంచి నిర్మాత ఇప్పుడు ఇలాగే ఇబ్బంది పడతున్నాడు. ‘యు టర్న్’ అనే విభిన్నమైన సినిమాతో ఆయన నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
దీంతో తర్వాత కొంచెం పెద్ద స్థాయి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ నిర్మించారు. అది గోపీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ మూవీ. ఈ సినిమాకు టాక్ పర్వాలేదు. ఓపెనింగ్స్ పర్వాలేదు. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. చివరికి లాస్ వెంచరే అయింది. ఇక గత ఏడాది శ్రీనివాసా ఇంకా పెద్ద సాహసం చేశాడు. రామ్ హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామిని నమ్మి పెద్ద బడ్జెట్లో ‘ది వారియర్’ తీశాడు. అది అయితే డిజాస్టర్ అయి నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చింది.
ఈ ఏడాది ‘కస్టడీ’తో అయినా కోలుకుంటాంలే అనుకుంటే.. అది కూడా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈసారి కూడా తమిళ దర్శకుడే ఆయనకు షాకిచ్చాడు. వెంకట్ ప్రభు తన స్థాయికి ఏమాత్రం తగని సినిమాను నిర్మాతను నిలువునా ముంచాడు. ఎలాంటి నిర్మాత అయినా ఇలా వరుసగా డిజాస్టర్లు ఎదురైతే తట్టుకోవడం కష్టం. ఐతే ‘ది వారియర్’ పోయిందని రామ్.. తాను బోయపాటితో కమిటైన సినిమాను శ్రీనివాసాకే ఇప్పించాడు. మరి ఈ సినిమా అయినా బాగా ఆడి ఈ నిర్మాతను నిలబెడుతుందేమో చూడాలి.
This post was last modified on May 16, 2023 5:35 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…