కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చూసి.. తెలుగు సినిమా వెలిగిపోతోందని, మన సినిమా గ్లోబల్ అయిపోయిందని తెగ సంబర పడిపోతుంటాం కానీ.. ఓవరాల్గా మన సినిమాల సక్సెస్ రేట్ ఏమంత పెరగలేదు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకూ ఆ రేట్ పడిపోతోంది. ప్రేక్షకులకు ప్రత్యామ్నాయ వినోదం పెరిగిపోయి.. పెద్ద కాన్వాస్ ఉన్న భారీ చిత్రాలకు మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. మామూలు చిత్రాల్లో సూపర్ అనిపించుకుంటే తప్ప సినిమాలు థియేట్రికల్ సక్సెస్ రుచి చూడట్లేదు.
దీంతో నిర్మాతల పరిస్థితి రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో తపనతో, రాజీ లేకుండా సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లకు చేదు అనుభవాలు తప్పట్లేదు. శ్రీనివాస్ చిట్టూరి అనే మంచి నిర్మాత ఇప్పుడు ఇలాగే ఇబ్బంది పడతున్నాడు. ‘యు టర్న్’ అనే విభిన్నమైన సినిమాతో ఆయన నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
దీంతో తర్వాత కొంచెం పెద్ద స్థాయి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ నిర్మించారు. అది గోపీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ మూవీ. ఈ సినిమాకు టాక్ పర్వాలేదు. ఓపెనింగ్స్ పర్వాలేదు. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. చివరికి లాస్ వెంచరే అయింది. ఇక గత ఏడాది శ్రీనివాసా ఇంకా పెద్ద సాహసం చేశాడు. రామ్ హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామిని నమ్మి పెద్ద బడ్జెట్లో ‘ది వారియర్’ తీశాడు. అది అయితే డిజాస్టర్ అయి నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చింది.
ఈ ఏడాది ‘కస్టడీ’తో అయినా కోలుకుంటాంలే అనుకుంటే.. అది కూడా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈసారి కూడా తమిళ దర్శకుడే ఆయనకు షాకిచ్చాడు. వెంకట్ ప్రభు తన స్థాయికి ఏమాత్రం తగని సినిమాను నిర్మాతను నిలువునా ముంచాడు. ఎలాంటి నిర్మాత అయినా ఇలా వరుసగా డిజాస్టర్లు ఎదురైతే తట్టుకోవడం కష్టం. ఐతే ‘ది వారియర్’ పోయిందని రామ్.. తాను బోయపాటితో కమిటైన సినిమాను శ్రీనివాసాకే ఇప్పించాడు. మరి ఈ సినిమా అయినా బాగా ఆడి ఈ నిర్మాతను నిలబెడుతుందేమో చూడాలి.
This post was last modified on May 16, 2023 5:35 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…