కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చూసి.. తెలుగు సినిమా వెలిగిపోతోందని, మన సినిమా గ్లోబల్ అయిపోయిందని తెగ సంబర పడిపోతుంటాం కానీ.. ఓవరాల్గా మన సినిమాల సక్సెస్ రేట్ ఏమంత పెరగలేదు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకూ ఆ రేట్ పడిపోతోంది. ప్రేక్షకులకు ప్రత్యామ్నాయ వినోదం పెరిగిపోయి.. పెద్ద కాన్వాస్ ఉన్న భారీ చిత్రాలకు మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. మామూలు చిత్రాల్లో సూపర్ అనిపించుకుంటే తప్ప సినిమాలు థియేట్రికల్ సక్సెస్ రుచి చూడట్లేదు.
దీంతో నిర్మాతల పరిస్థితి రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో తపనతో, రాజీ లేకుండా సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లకు చేదు అనుభవాలు తప్పట్లేదు. శ్రీనివాస్ చిట్టూరి అనే మంచి నిర్మాత ఇప్పుడు ఇలాగే ఇబ్బంది పడతున్నాడు. ‘యు టర్న్’ అనే విభిన్నమైన సినిమాతో ఆయన నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
దీంతో తర్వాత కొంచెం పెద్ద స్థాయి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ నిర్మించారు. అది గోపీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ మూవీ. ఈ సినిమాకు టాక్ పర్వాలేదు. ఓపెనింగ్స్ పర్వాలేదు. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. చివరికి లాస్ వెంచరే అయింది. ఇక గత ఏడాది శ్రీనివాసా ఇంకా పెద్ద సాహసం చేశాడు. రామ్ హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామిని నమ్మి పెద్ద బడ్జెట్లో ‘ది వారియర్’ తీశాడు. అది అయితే డిజాస్టర్ అయి నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చింది.
ఈ ఏడాది ‘కస్టడీ’తో అయినా కోలుకుంటాంలే అనుకుంటే.. అది కూడా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈసారి కూడా తమిళ దర్శకుడే ఆయనకు షాకిచ్చాడు. వెంకట్ ప్రభు తన స్థాయికి ఏమాత్రం తగని సినిమాను నిర్మాతను నిలువునా ముంచాడు. ఎలాంటి నిర్మాత అయినా ఇలా వరుసగా డిజాస్టర్లు ఎదురైతే తట్టుకోవడం కష్టం. ఐతే ‘ది వారియర్’ పోయిందని రామ్.. తాను బోయపాటితో కమిటైన సినిమాను శ్రీనివాసాకే ఇప్పించాడు. మరి ఈ సినిమా అయినా బాగా ఆడి ఈ నిర్మాతను నిలబెడుతుందేమో చూడాలి.
This post was last modified on May 16, 2023 5:35 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…