సినిమా హీరోయిన్లు కొందరు సినిమా వాళ్లనే పెళ్లాడితే.. కొందరు వ్యాపార వేత్తలతో జీవితాన్ని పంచుకుంటూ ఉంటారు. చాలా కొద్దిమంది మాత్రమే రాజకీయ నాయకులతో మూడు ముళ్ల బంధంలోకి వెళ్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఈ బాటనే ఎంచుకుంది. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్లు తమ ప్రేమాయణాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట.. కొంత కాలంగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొంచెం గ్యాప్ తర్వాత పెళ్లి కూడా ఉండొచ్చు. ఐతే ఒకప్పుడు తన పెళ్లి విషయంలో పరిణీతి చేసిన వ్యాఖ్యలు వింటే.. ఇప్పుడు జరుగుతున్నది చూసి షాకవకుండా ఉండలేం. గతంలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిని పెళ్లాడనని తేల్చి చెప్పింది.
సినిమా రంగంలో పెళ్లాడాలని కోరుకునే వ్యక్తి అని అడిగితే.. ఆమె సైఫ్ అలీ ఖాన్ పేరు చెప్పింది. అతనంటే తనకు చాలా చాలా ఇష్టమని పేర్కొంది. మరి రాజకీయ రంగంలో ఎవరిని పెళ్లాడతావ్ అని అడిగితే.. ‘‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిని పెళ్లాడను. అలా ఎప్పటికీ జరగదు’’ అని ఆమె తేల్చి చెప్పింది.
అప్పుడు అంత ఖరాఖండిగా చెప్పిన పరిణీతి.. ఇప్పుడు ఎంపీ అయిన రాఘవ్ చడ్డాను పెళ్లాడబోతుండటం చూసి.. పాత వీడియో బయటికి తీసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు రాజకీయ నాయకుల మీద ఉన్న అసహ్యం.. ఇప్పుడు ఎక్కడికి పోయింది.. ఇంతలో నీ మనసు ఎలా మారింది అంటూ ఆమెను నిలదీస్తున్నారు. కానీ మనిషి ఆలోచన ఎల్లపుడూ ఒకేలా ఉండకపోవచ్చు.. వ్యక్తుల మీద అభిప్రాయాలు మారొచ్చు కాబట్టి ఈ విషయాన్ని మరీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
This post was last modified on May 16, 2023 4:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…