సినిమా హీరోయిన్లు కొందరు సినిమా వాళ్లనే పెళ్లాడితే.. కొందరు వ్యాపార వేత్తలతో జీవితాన్ని పంచుకుంటూ ఉంటారు. చాలా కొద్దిమంది మాత్రమే రాజకీయ నాయకులతో మూడు ముళ్ల బంధంలోకి వెళ్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఈ బాటనే ఎంచుకుంది. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్లు తమ ప్రేమాయణాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట.. కొంత కాలంగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొంచెం గ్యాప్ తర్వాత పెళ్లి కూడా ఉండొచ్చు. ఐతే ఒకప్పుడు తన పెళ్లి విషయంలో పరిణీతి చేసిన వ్యాఖ్యలు వింటే.. ఇప్పుడు జరుగుతున్నది చూసి షాకవకుండా ఉండలేం. గతంలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిని పెళ్లాడనని తేల్చి చెప్పింది.
సినిమా రంగంలో పెళ్లాడాలని కోరుకునే వ్యక్తి అని అడిగితే.. ఆమె సైఫ్ అలీ ఖాన్ పేరు చెప్పింది. అతనంటే తనకు చాలా చాలా ఇష్టమని పేర్కొంది. మరి రాజకీయ రంగంలో ఎవరిని పెళ్లాడతావ్ అని అడిగితే.. ‘‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిని పెళ్లాడను. అలా ఎప్పటికీ జరగదు’’ అని ఆమె తేల్చి చెప్పింది.
అప్పుడు అంత ఖరాఖండిగా చెప్పిన పరిణీతి.. ఇప్పుడు ఎంపీ అయిన రాఘవ్ చడ్డాను పెళ్లాడబోతుండటం చూసి.. పాత వీడియో బయటికి తీసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు రాజకీయ నాయకుల మీద ఉన్న అసహ్యం.. ఇప్పుడు ఎక్కడికి పోయింది.. ఇంతలో నీ మనసు ఎలా మారింది అంటూ ఆమెను నిలదీస్తున్నారు. కానీ మనిషి ఆలోచన ఎల్లపుడూ ఒకేలా ఉండకపోవచ్చు.. వ్యక్తుల మీద అభిప్రాయాలు మారొచ్చు కాబట్టి ఈ విషయాన్ని మరీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
This post was last modified on May 16, 2023 4:04 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…