పోస్టర్ మీద జేమ్స్ కామెరూన్ పేరు కనిపిస్తే చాలు.. దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతున్నారు. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో ఆయన రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా ‘టైటానిక్’ సినిమా దగ్గర్నుంచి ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
‘టైటానిక్’ అప్పట్లో అన్ని రికార్డులనూ తుడిచిపెట్టేయగా.. ఆ తర్వాత పదేళ్లకు వచ్చిన ‘అవతార్’ అంతకుమించిన రికార్డులను నెలకొల్పింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘అవతార్-2’ మీద ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. గత ఏడాది డిసెంబరు 17న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. వసూళ్ల మోత మోగించింది.
అసాధ్యం అనుకున్న 2 వేల బిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటేసి.. మరింతగా కలెక్షన్లు రాబట్టింది. ఐతే ఇలాంటి సినిమాను బిగ్ స్క్రీన్ మీద, త్రీడీలో చూస్తేనే మజా. కానీ ఆ అవకాశం కోల్పోయిన వాళ్లు, డివైడ్ టాక్ వల్ల వెనుకంజ వేసిన వారు.. బుల్లితెరపై సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఐతే వాళ్లు చాలా రోజులే నిరీక్షించాల్సి వచ్చింది. థియేటర్లలో విడుదలయ్యాక దాదాపు ఆర నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్ని ఫ్లాట్ ఫ్లామ్స్లో పెయిడ్ స్ట్రీమింగ్ ఇచ్చారు కానీ.. హాట్ స్టార్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఫ్రీగా సినిమా చూసే అవకాశం త్వరలోనే రానుంది.
జూన్ 7న హాట్ స్టార్లో తెలుగు సహా పలు భాషల్లో ‘అవతార్-2’ డిజిటల్ రిలీజ్కు రంగం సిద్ధమైంది. హెచ్డీ సహా పలు వెర్షన్లలో సినిమాను స్ట్రీమ్ చేయబోతోంది హాట్ స్టార్. పెద్ద స్క్రీన్, హై ఎండ్ టెక్నాలజీ ఉన్న టీవీల్లో అయితే ‘అవతార్-2’ చూస్తే బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్కు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందని చెప్పొచ్చు.
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…