అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బోయపాటి శీను హీరో రామ్ తో చేస్తున్న సినిమా మీద మాములు అంచనాలు లేవు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మాస్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ ఈ మూవీ కోసమే బరువు పెరిగి మరీ అవతారం మార్చుకున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించి ఇవాళ రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. అసలు పేరు లేకుండా కేవలం హీరో దర్శకుడి కాంబోలో బోయపాటి రాపో అనే వీడియో రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకీ గ్లిమ్ప్స్ లో ఏముంది.
రామ్ పవర్ ఫుల్ లుక్స్ ని మాత్రమే రివీల్ చేశారు. విలన్ ని ఛాలెంజ్ చేస్తూ నీ గేటు దాటా స్టేటు దాటా ఇంకా ఏంట్రా లిమిట్సంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగుని చూపించారు. ఒక్క ఫ్రేమ్ లో శ్రీలీలని చూపించగా, చుట్టూ రౌడీ గ్యాంగ్ తప్ప ఇంకెవరినీ ఓపెన్ చేయకుండా తెలివిగా కట్ చేశారు. రామ్ మునుపెన్నడూ చూడని ఊర మాస్ వేషంలో మోటుగా ఉన్నాడు. విజువల్స్ గట్రా బోయపాటి రెగ్యులర్ స్టైల్ లో ఉన్నప్పటికీ లెజెండ్, సింహా టైపు మేకింగ్ తో మరోసారి తనదైన మార్కు మసాలా వినోదాన్ని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
బ్యాక్ గ్రౌండ్ లో తమన్ నేపధ్య సంగీతం సరైనోడు రేంజ్ లో బాగా ఎలివేట్ అయ్యింది. సంతోష్ ఛాయాగ్రహణం సమకూర్చారు అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ అనుకుంటున్నారో చిన్న లీక్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. హీరో పాత్ర పేరే పెట్టే పరిశీలన జరుగుతోందట. రెడ్ యావరేజ్ ఫలితం, వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ ఈ బోయపాటి రాపో మీద భారీ నమ్మకం పెట్టుకున్నాడు. ఇది కనక సరిగ్గా వర్కౌట్ అయితే కేవలం ఆరు నెలల గ్యాప్ లో రిలీజ్ కాబోయే డబుల్ ఇస్మార్ట్ కు సానుకూలంగా ఉంటుంది.
This post was last modified on May 15, 2023 12:39 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…