సినీ రంగంలో ఉన్న వాళ్లకు కూడా సినీ ఫక్కీలో ప్రేమలో పడటం.. ప్రేమాయణం గురించి తెలిసి ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కోవడం.. కొంచెం నాటకీయ రీతిలో పెళ్లి చేసుకోవడం లాంటి అనుభవాలు ఉంటాయి. టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రేమ పెళ్లి విషయంలో మరీ నాటకీయతో, ఇబ్బందులు లేకపోయినా.. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయట.
వెన్నెల కిషోర్ నిర్వహిస్తున్న టీవీ షోకు తన భార్య స్పందనతో కలిసి అతిథిగా వచ్చిన సందర్భంగా మారుతి ఆ సంగతులు కొన్ని పంచుకున్నారు. స్పందనతో తనది ప్రేమ పెళ్లే అని.. ఐతే తమ ప్రేమాయణం బయటపడకుండా అన్నీ బాగానే మేనేజ్ చేసినా.. స్పందనకు డైరీ రాసే అలవాటు ఉండటం వల్ల తామిద్దరం దొరికిపోయామని వెల్లడించాడు మారుతి.
మారుతి నిజానికి స్పందన కంటే ముందు ఆమె తల్లిని కలిశారట. మచిలీపట్నంలో జూనియర్ జేసీ వింగ్ అనే క్లబ్లో స్పందన తల్లి చురుగ్గా ఉండేవారని.. అక్కడ ఆమె పరిచయం కాగా.. తర్వాత ఓ డిన్నర్లో స్పందనతో పరిచయం జరిగిందని.. ఆమె చదివే స్కూల్ పక్కనే తన స్టిక్కరింగ్ షాప్ పెట్టానని.. నెమ్మదిగా తమ పరిచయం ప్రేమగా మారిందని మారుతి వెల్లడించాడు.
తామిద్దరం ప్రేమలో పడేటపుడు స్పందన పదో తరగతి చదువుతోందని మారుతి చెప్పగా.. కాదు ఎనిమిదో తరగతే అని స్పందన వారించడం విశేషం. ఇక డైరీ ట్విస్టు గురించి చెబుతూ.. ‘‘నేను తనతో ప్రేమలో పడ్డాక హైదరాబాద్ వచ్చేశాను. స్పందన వాళ్లు విజయవాడ వెళ్లారు. తను నన్ను ఎప్పుడు కలిసింది.. ఎప్పుడు మాట్లాడింది అన్నీ డైరీలో రాసేది. మేమిద్దరం దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వాళ్లకు ల్యాండ్ ఫోన్ ఉండేది. మాకు లేదు. అందుకే ఇద్దరం కలిసి సెల్ ఫోన్లు కొన్నాం. కానీ నాకు కాల్ చేసిన విషయం కూడా ఆమె డైరీలో రాసేది. వాళ్లింట్లో వాళ్లు అది చూడటంతో మా ప్రేమ విషయం బయటపడిపోయింది. పెళ్లి విషయంలో మేం మరీ ఇబ్బందులు ఎదుర్కోలేదు’’ అని మారుతి తెలిపాడు.
This post was last modified on May 12, 2023 7:42 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…