సినీ రంగంలో ఉన్న వాళ్లకు కూడా సినీ ఫక్కీలో ప్రేమలో పడటం.. ప్రేమాయణం గురించి తెలిసి ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కోవడం.. కొంచెం నాటకీయ రీతిలో పెళ్లి చేసుకోవడం లాంటి అనుభవాలు ఉంటాయి. టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రేమ పెళ్లి విషయంలో మరీ నాటకీయతో, ఇబ్బందులు లేకపోయినా.. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయట.
వెన్నెల కిషోర్ నిర్వహిస్తున్న టీవీ షోకు తన భార్య స్పందనతో కలిసి అతిథిగా వచ్చిన సందర్భంగా మారుతి ఆ సంగతులు కొన్ని పంచుకున్నారు. స్పందనతో తనది ప్రేమ పెళ్లే అని.. ఐతే తమ ప్రేమాయణం బయటపడకుండా అన్నీ బాగానే మేనేజ్ చేసినా.. స్పందనకు డైరీ రాసే అలవాటు ఉండటం వల్ల తామిద్దరం దొరికిపోయామని వెల్లడించాడు మారుతి.
మారుతి నిజానికి స్పందన కంటే ముందు ఆమె తల్లిని కలిశారట. మచిలీపట్నంలో జూనియర్ జేసీ వింగ్ అనే క్లబ్లో స్పందన తల్లి చురుగ్గా ఉండేవారని.. అక్కడ ఆమె పరిచయం కాగా.. తర్వాత ఓ డిన్నర్లో స్పందనతో పరిచయం జరిగిందని.. ఆమె చదివే స్కూల్ పక్కనే తన స్టిక్కరింగ్ షాప్ పెట్టానని.. నెమ్మదిగా తమ పరిచయం ప్రేమగా మారిందని మారుతి వెల్లడించాడు.
తామిద్దరం ప్రేమలో పడేటపుడు స్పందన పదో తరగతి చదువుతోందని మారుతి చెప్పగా.. కాదు ఎనిమిదో తరగతే అని స్పందన వారించడం విశేషం. ఇక డైరీ ట్విస్టు గురించి చెబుతూ.. ‘‘నేను తనతో ప్రేమలో పడ్డాక హైదరాబాద్ వచ్చేశాను. స్పందన వాళ్లు విజయవాడ వెళ్లారు. తను నన్ను ఎప్పుడు కలిసింది.. ఎప్పుడు మాట్లాడింది అన్నీ డైరీలో రాసేది. మేమిద్దరం దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వాళ్లకు ల్యాండ్ ఫోన్ ఉండేది. మాకు లేదు. అందుకే ఇద్దరం కలిసి సెల్ ఫోన్లు కొన్నాం. కానీ నాకు కాల్ చేసిన విషయం కూడా ఆమె డైరీలో రాసేది. వాళ్లింట్లో వాళ్లు అది చూడటంతో మా ప్రేమ విషయం బయటపడిపోయింది. పెళ్లి విషయంలో మేం మరీ ఇబ్బందులు ఎదుర్కోలేదు’’ అని మారుతి తెలిపాడు.
This post was last modified on May 12, 2023 7:42 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…