అక్కినేని నాగార్జున గతంలో బహు భాషా దర్శకులతో పని చేశాడు. తమిళం నుంచి కూడా పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు తీశారు. ఇదే కోవలో వెంకట్ ప్రభు సైతం నాగ్తో ఓ సినిమా చేయాలనుకున్నారట. ప్రస్తుతం నాగ్ కొడుకు నాగచైతన్యతో ఆయన ‘కస్టడీ’ తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దర్శకుడితో నాగ్ సినిమా చేయాల్సిందట. కానీ అనివార్య కారణాలతో అది క్యాన్సిల్ అయిందట.
దాని గురించి వెంకట్ ప్రభు మీడియాకు వివరిస్తూ.. ‘‘నేను తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు. అజిత్ గారితో తీసిన ‘మన్కాతా’ సినిమాను తెలుగులో సమాంతరంగా నాగార్జున గారితో చేయడానికి సంప్రదింపులు జరిగాయి. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు. తర్వాత ‘మానాడు’ సినిమాను కూడా ఒకేసారి తెలుగులో వేరే హీరోగా చేయాాలనుకున్నా. కానీ అదీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ‘కస్టడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నా’’ అని వెంకట్ తెలిపాడు.
‘కస్టడీ’ సినిమా కథకు స్ఫూర్తి ఒక మలయాళ చిత్రం అని చెబుతూ.. చైతూనే ఎందుకు ఇందులో లీడ్ రోల్ కోసం తీసుకున్నది వెంకట్ వెల్లడించాడు. ‘‘మలయాళంలో నాయట్టు సినిమా నాకు బాగా నచ్చింది. అందులో ప్లాట్ పాయింట్ చూసి స్ఫూర్తి పొందాను. ఆ పాయింట్తో ఒక కమర్షియల్ కోణంలో సినిమా ఎందుకు తీయకూడదు అని ‘కస్టడీ’ కథ రాశాను. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఒక పాట చూస్తుంటే నా పాత్రకు చైతూనే సరిపోతాడు అనిపించి అతడికి కథ వినిపించాను. తనకు నచ్చి ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాకు శివ అనే టైటిల్ పెడదామనుకున్నా. కానీ చైతూ వద్దన్నాడు’’ అని తెలిపాడు.
This post was last modified on May 11, 2023 12:50 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…