Movie News

ఆ సినిమా నాగార్జున చేయాల్సిందట

అక్కినేని నాగార్జున గతంలో బహు భాషా దర్శకులతో పని చేశాడు. తమిళం నుంచి కూడా పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు తీశారు. ఇదే కోవలో వెంకట్ ప్రభు సైతం నాగ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట. ప్రస్తుతం నాగ్ కొడుకు నాగచైతన్యతో ఆయన ‘కస్టడీ’ తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దర్శకుడితో నాగ్ సినిమా చేయాల్సిందట. కానీ అనివార్య కారణాలతో అది క్యాన్సిల్ అయిందట.

దాని గురించి వెంకట్ ప్రభు మీడియాకు వివరిస్తూ.. ‘‘నేను తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు. అజిత్ గారితో తీసిన ‘మన్కాతా’ సినిమాను తెలుగులో సమాంతరంగా నాగార్జున గారితో చేయడానికి సంప్రదింపులు జరిగాయి. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు. తర్వాత ‘మానాడు’ సినిమాను కూడా ఒకేసారి తెలుగులో వేరే హీరోగా చేయాాలనుకున్నా. కానీ అదీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ‘కస్టడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నా’’ అని వెంకట్ తెలిపాడు.

‘కస్టడీ’ సినిమా కథకు స్ఫూర్తి ఒక మలయాళ చిత్రం అని చెబుతూ.. చైతూనే ఎందుకు ఇందులో లీడ్ రోల్ కోసం తీసుకున్నది వెంకట్ వెల్లడించాడు. ‘‘మలయాళంలో నాయట్టు సినిమా నాకు బాగా నచ్చింది. అందులో ప్లాట్ పాయింట్ చూసి స్ఫూర్తి పొందాను. ఆ పాయింట్‌తో ఒక కమర్షియల్ కోణంలో సినిమా ఎందుకు తీయకూడదు అని ‘కస్టడీ’ కథ రాశాను. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఒక పాట చూస్తుంటే నా పాత్రకు చైతూనే సరిపోతాడు అనిపించి అతడికి కథ వినిపించాను. తనకు నచ్చి ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాకు శివ అనే టైటిల్ పెడదామనుకున్నా. కానీ చైతూ వద్దన్నాడు’’ అని తెలిపాడు.

This post was last modified on May 11, 2023 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

4 minutes ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

28 minutes ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

1 hour ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

1 hour ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

4 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

5 hours ago