రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న నాగార్జున 99వ సినిమా వ్యవహారం ఎంతకూ తేలడం లేదు. మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేక్ గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ రీమేక్ హక్కుల విషయంలో ఏవో ఇబ్బందులు రావడం వల్ల రెగ్యులర్ షూటింగ్ వాయిదా వేస్తూ వెళ్లారు. నాగ్ మీద లుక్ టెస్ట్ ని నెలల క్రితమే పూర్తి చేశారు. సరే కారణం ఏదైనా విపరీతమైన ఆలస్యం జరగడంతో ఫైనల్ గా ఇది ఉంటుందా లేదానే అనుమానం నెలకొంది. దీనికి నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు
జూన్ మూడో వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని ఇతర వివరాలు తర్వాత చెబుతామని అన్నారు. అయితే ప్రసన్న కుమార్ పేరు మాత్రం తీసుకురాలేదు. అడిగితే మళ్ళీ చెప్తామన్నారు తప్పించి స్పష్టత ఇవ్వలేదు. అంటే డైరెక్టర్ మారే అవకాశం ఉందని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టే. ఒరిజినల్ వెర్షన్ నుంచి కేవలం కొంత భాగమే తీసుకున్నామని ఎన్నో మార్పులతో దానికి పోలిక లేకుండా ఉంటుందని మరో న్యూస్ చెప్పారు. ఈ లెక్కన నోటి దాకా వచ్చిన బిర్యానీ చేజారిపోయినట్టు డెబ్యూనే నాగార్జున లాంటి సీనియర్ స్టార్ తో ప్లాన్ చేసుకున్న ప్రసన్నకు ఇది షాకే అవుతుంది
ఇంకో నెల రోజులు టైం ఉంది కాబట్టి అనౌన్స్ మెంట్ కోసం వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ అయితే నాగ్ స్క్రిప్ట్ పట్ల చాలా నిక్కచ్చిగా ఉన్నారని, వరస డిజాస్టర్ల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. అందుకే నెలలు గడిచిపోతున్నా సినిమా మొదలుపెట్టేందుకు తొందరపాటు ప్రదర్శించకుండా కూల్ గా ఉన్నారు. నాగార్జునకు స్నేహితుడిగా ఇందులో అల్లరి నరేష్ నటించబోతున్నాడు. కథ మొత్తం కేంద్రీకృతమయ్యే కీలకమైన హీరోయిన్ ని ఎవరిని తీసుకుంటారోననే సస్పెన్స్ ఇంకా తేలలేదు. దీనికోసం పెద్ద కసరత్తే జరుగుతోంది
This post was last modified on May 10, 2023 2:36 pm
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…