అఖిల్తో పాటు అక్కినేని ఫ్యామిలీ, అలాగే అభిమానులు ‘ఏజెంట్’ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్, మాస్ ఇమేజ్ వచ్చేస్తుందని అంచనాలు కట్టారు. తీరా చూస్తే.. అఖిల్ కెరీర్లోనే కాక టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా చిత్రం.
ఈ సినిమా రిలీజ్కు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘ఏజెంట్’ ఇచ్చిన హై వల్ల తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయంలో ఉన్నట్లు అఖిల్ చెప్పాడు. అప్పుడు పాజిటివ్ సెన్స్లో ఆ మాట చెప్పినా.. ఇప్పుడు ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో తర్వాత ఏం చేయాలో పాలుపోని స్థితిలో అతనున్నాడు. కాగా ‘ఏజెంట్’ పెద్ద హిట్టవుతుందని అందరూ నమ్ముతున్న టైంలో అఖిల్తో ఓ సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేసింది.
సాహో, రాధేశ్యామ్ చిత్రాలకు ఈ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన అనిల్ అనే కుర్రాడిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ ‘ఏజెంట్’ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ ఫలితం ఆధారంగా యువి వాళ్లలో ఎలాంటి మార్పు రాలేదట.
ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికే చూస్తున్నారట. అంతే కాక ఈ చిత్రం కోసం ‘ధీర’ అనే టైటిల్ను కూడా రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ‘ఏజెంట్’ విడుదలకు ముందే ఈ సినిమా కోసం అఖిల్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తారని.. కొన్ని నెలల్లో ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని సమాచారం.
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…