Rajamouli
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత గాథను వెండితెరపైకి తేవడమే అని దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల కిందటే ప్రకటించాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలను ‘మహాభారతం’ తీయడానికి ముందు తనకు తాను పెట్టుకుంటున్న పరీక్షలా.. ఒక ట్రయల్ లాగా చెబుతూ వస్తున్నాడు జక్కన్న. బాహుబలి మొదలైన సమయంలోనే ‘మహాభారతం’ గురించి ప్రస్తావించి.. అది తీయడానికి తనకు పదేళ్ల అనుభవం కావాలని పేర్కొన్నాడాయన. చూస్తుండగానే దాదాపు పదేళ్లు గడిచిపోయాయి. కానీ ఇంకా ‘మహాభారతం’ పనులు మొదలుకాలేదు. ప్రస్తుతానికి జక్కన్న దృష్టి.. మహేష్ బాబుతో తీయబోయే సినిమా మీదే ఉంది. మరి దీని తర్వాత అయినా ‘మహాభారతం’ మొదలుపెడతాడా అనే విషయంలో స్పష్టత లేదు. ఐతే తాను ఈ సినిమా తీస్తే పది భాగాలుగా ఉంటుందని రాజమౌళి సంకేతాలు ఇవ్వడం విశేషం.
రాజమౌళి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమంలో భాగంగా ‘మహాభారతం’ గురించి ప్రస్తావన వచ్చింది. టీవీలో ఆ కథను 260కి పైగా ఎపిసోడ్లుగా తీశారని.. మరి మీరు సినిమాగా తీస్తే అది ఎన్ని భాగాలుగా ఉంటుందని రాజమౌళికి ఒక వ్యక్తి ప్రశ్నించారు. దీనికి జక్కన్న బదులిస్తూ.. ‘‘మహాభారతం మీద ఇండియాలో వచ్చిన అన్ని వెర్షన్లనూ చదవడానికే ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతుంది. నోట్స్ ఏమీ రాసుకోకుండా.. కేవలం చదవడానికి మాత్రమే అంత సమయం పడుతుంది. ఇక ఆ సినిమా తీస్తే పది భాగాలుగా తీయాల్సి ఉంటుందని నా అంచనా’’ అని తెలిపాడు. మహాభారత కథకు ఉన్న విస్తృతి దృష్ట్యా.. రాజమౌళి ఆ సినిమా తీస్తే నాలుగైదు భాగాలైనా ఉంటుందని అనుకున్నారు. కానీ ఏకంగా పది భాగాలుగా తీయాల్సి ఉంటుందన్న జక్కన్న మాటతో ఇది ఎంత మెగా ప్రాజెక్టో అర్థమవుతుంది. మహేష్ బాబు సినిమాను పూర్తి చేసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినా.. తన జీవిత కాలంలో ఇంకో సినిమా తీయకుండా దీనికే జక్కన్న అంకితం అయిపోవాల్సి ఉంటుందేమో.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…