శక్తి.. ఈ పేరెత్తితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక గగుర్పాటు కలుగుతుంది. ఆ సమయానికి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమాల్లో అది ఒకటి. అంచనాలు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ అభిమానులు పెట్టుకున్న నమ్మకాలను కూల్చేస్తూ.. నిర్మాత అశ్వినీదత్ను ముంచేస్తూ దారుణమైన డిజాస్టర్ అందించాడు మెహర్ రమేష్.
పుష్కర కాలం దాటినా శక్తి సినిమా ఏదో రకంగా ఎన్టీఆర్ అభిమానులను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక నిర్మాత అశ్వినీదత్ అయితే ఆ సినిమా పేరు తలుచుకుంటే ఒక రకమైన నిరాశావాదంలోకి వెళ్లిపోతారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మరోసారి శక్తి సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు దత్. ఈ సినిమా తనకు ఏకంగా రూ.32 కోట్ల నష్టం మిగిల్చినట్లు దత్ వెల్లడించారు.
పన్నెండేళ్ల కిందట ఇంత నష్టం అంటే మామూలు విషయం కాదు. అంత నష్టం తర్వాత సినిమాలు తీయడం అంటే గొప్ప విషయమే. కానీ ఆ సమయంలో కొన్నేళ్ల పాటు తనకు సినిమాల మీదే విరక్తి కలిగినట్లు దత్ వెల్లడించారు. శక్తి సినిమా నాకు ఆ రోజుల్లోనే 32 కోట్ల నష్టం మిగిల్చింది. ఇంత నష్టం అంటే తట్టుకోవడం కష్టం. ఇక సినిమాలే ఆపేద్దాం అన్న ఆలోచన వచ్చింది. నాలుగైదేళ్లు సినిమాలు తీయలేదు. అసలు సినిమాలు చేయాలన్న ఆలోచన కూడా రాలేదు అని దత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
శక్తి సినిమా తర్వాత దత్ మాత్రమే కాక.. ఆయన కూతుళ్లు కూడా నాలుగేళ్ల పాటు సినిమాలు తీయలేదు. తర్వాత ప్రియాంక, స్వప్న కలిసి ఎవడే సుబ్రహ్మణ్యంతో ప్రొడక్షన్లోకి దిగారు. ఆపై మహానటి మూవీతో దత్ సైతం రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వైజయంతీ వారి ప్రయాణం బాగానే సాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్-కే లాంటి మెగా మూవీని నిర్మిస్తున్నారు దత్.
This post was last modified on May 5, 2023 7:28 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…