Movie News

అభిమానులకు నాగచైతన్య భరోసా

వరస డిజాస్టర్లతో బాగా డౌన్ లో ఉన్న అక్కినేని అభిమానులకు ఇప్పుడున్న ఒకే ఒక్క ఆశ కస్టడీ. ఏజెంట్ దారుణంగా డిజాస్టర్ కావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాత అనిల్ సుంకర నాలుగో రోజే ఫలితం గురించి ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం చూస్తే ఏ స్థాయిలో తిరస్కారానికి గురయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ బరువంతా నాగ చైతన్య మీద పడింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు గత కొంత కాలంగా తాము వరస పరాజయాలతో ఉన్న మాట వాస్తవమేనని ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే కనక బెస్ట్ ఇచ్చే దిశగా కష్టపడతామని హామీ ఇచ్చాడు .

కస్టడీ విషయంలో పూర్తి నమ్మకంతో సినిమా చూడొచ్చని కాన్ఫిడెన్స్ నింపాడు. ఒక డిఫరెంట్ పాయింట్ తో దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారని సక్సెస్ అవుతుందని నొక్కి వక్కాణించాడు. అభిమానులకు కావాల్సింది ఈ ఊరటే. అఖిల్ దుబాయ్ వెళ్ళిపోయాడు. నాగార్జున అందుబాటులో లేరు. అందుకే వాళ్ళ చూపంతా చైతు మీదే ఉంది. అసంతృప్తిని ఇంకా చల్లార్చే ప్రయత్నంలో భాగంగా ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో వెయ్యికి పైగా ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా ఫోటో షూట్ ప్లస్ మీటింగ్ చేయబోతున్నాడు. గంటల తరబడి సాగే ఈ ప్రోగ్రాం ప్లానింగ్ జరుగుతోంది

ఎలాగూ అక్కినేని ఫ్యామిలీ తర్వాత సినిమాలు వచ్చేందుకు బాగా టైం పడుతుంది. నాగ్ బెజవాడ ప్రసన్నకుమార్ ల షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. యువి బ్యానర్ లో అఖిల్ చేయబోయే మూవీ తాలూకు అనౌన్స్ మెంట్ వస్తే కానీ నిర్ధారణగా చెప్పలేం. సుశాంత్, సుమంత్ లు సపోర్టింగ్ రోల్స్ కి మారిపోయారు. సో కస్టడీ కనక బ్లాక్ బస్టర్ కొడితే ఆ ఆనందం ముందు ఈ గ్యాప్ లన్నీ మర్చిపోవచ్చు. హీరోయిన్ కృతి శెట్టి, విలన్ అరవింద్ స్వామి, డైరెక్టర్ వెంకట్ ప్రభు, సంగీత దర్శకులు ఇళయరాజా-యువన్ శంకర్ రాజా ఇలా అందరికీ కస్టడీ విజయం సాధించడం చాలా కీలకం

This post was last modified on May 4, 2023 11:46 am

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

32 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

49 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

1 hour ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago