హీరోలు ప్రొడ్యూసర్లుగా మారడం ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ హీరోయిన్లు రిస్క్ తీసుకోవడం తక్కువ. ఒక్కసారి చేయి కాలితే వచ్చే నష్టం భరించడం అంత సులభం కాదు కాబట్టి ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. కాజల్ అగర్వాల్ ఇలాగే నిర్మాణంలో దిగి ఓ మీడియం బడ్జెట్ సినిమా తీస్తే నెలలు గడుస్తున్నా అది రిలీజ్ కాలేకపోయింది. కానీ సమంతా అలా జరక్కుండా పక్కా ప్లానింగ్ తో బాలీవుడ్ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి త్వరలోనే ఒక జాయింట్ వెంచర్ ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించిన పలు దఫాల చర్చలు ఇద్దరి మధ్య ముంబైలో జరిగాయి.
ఇందులో సామ్ ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఫిమేల్ సెంట్రిక్ గా రూపొందబోయే ఈ ప్రాజెక్ట్ ని ప్యాన్ ఇండియా మూవీగా మలచాలా లేక వెబ్ సిరీస్ గా చేయాలానే నిర్ణయం ఇంకా తీసుకోలేదని టాక్. అనుష్క తమ్ముడు కర్నేష్ శర్మని దర్శకుడిగా దీని ద్వారానే లాంచ్ చేయాలనేది మరో ప్లాన్. మిగిలిన క్యాస్టింగ్, ఇతర టెక్నికల్ డీటెయిల్స్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇద్దరూ కలిసి సుమారు పాతిక కోట్లకు పైగానే బడ్జెట్ ని దీని కోసం సిద్ధం చేయబోతున్నారట. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతాకు వచ్చిన గుర్తింపు మీదనే బిజినెస్ చేయబోతున్నారు.
ప్రస్తుతం చేస్తున్న సిటాడెల్ రీమేక్ మీద సామ్ బోలెడు నమ్మకం పెట్టుకుంది.రాజ్ అండ్ డీకే దర్శకులు కావడంతో ఇంకో బ్రేక్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అయితే ఇదే పాత్రని ప్రియాంకా చోప్రా చేసిన ఒరిజినల్ వెర్షన్ తొలి రెండు ఎపిసోడ్లకు అమెజాన్ ప్రైమ్ లో ఆశించిన స్పందన రాకపోవడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. శాకుంతలం గట్టి దెబ్బ కొట్టడంతో ఆ షాక్ నుంచి బయట పడాలంటే సిటాడెల్ సక్సెస్ కావడం చాలా కీలకం. ఈ మధ్య యాక్టివ్ గా ఉండటం బాగా తగ్గించేసిన అనుష్క శర్మ కూడా ఇకపై నటిగా నిర్మాతగా బాగా బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.
This post was last modified on May 4, 2023 12:08 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…