హీరోలు ప్రొడ్యూసర్లుగా మారడం ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ హీరోయిన్లు రిస్క్ తీసుకోవడం తక్కువ. ఒక్కసారి చేయి కాలితే వచ్చే నష్టం భరించడం అంత సులభం కాదు కాబట్టి ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. కాజల్ అగర్వాల్ ఇలాగే నిర్మాణంలో దిగి ఓ మీడియం బడ్జెట్ సినిమా తీస్తే నెలలు గడుస్తున్నా అది రిలీజ్ కాలేకపోయింది. కానీ సమంతా అలా జరక్కుండా పక్కా ప్లానింగ్ తో బాలీవుడ్ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి త్వరలోనే ఒక జాయింట్ వెంచర్ ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించిన పలు దఫాల చర్చలు ఇద్దరి మధ్య ముంబైలో జరిగాయి.
ఇందులో సామ్ ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఫిమేల్ సెంట్రిక్ గా రూపొందబోయే ఈ ప్రాజెక్ట్ ని ప్యాన్ ఇండియా మూవీగా మలచాలా లేక వెబ్ సిరీస్ గా చేయాలానే నిర్ణయం ఇంకా తీసుకోలేదని టాక్. అనుష్క తమ్ముడు కర్నేష్ శర్మని దర్శకుడిగా దీని ద్వారానే లాంచ్ చేయాలనేది మరో ప్లాన్. మిగిలిన క్యాస్టింగ్, ఇతర టెక్నికల్ డీటెయిల్స్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇద్దరూ కలిసి సుమారు పాతిక కోట్లకు పైగానే బడ్జెట్ ని దీని కోసం సిద్ధం చేయబోతున్నారట. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతాకు వచ్చిన గుర్తింపు మీదనే బిజినెస్ చేయబోతున్నారు.
ప్రస్తుతం చేస్తున్న సిటాడెల్ రీమేక్ మీద సామ్ బోలెడు నమ్మకం పెట్టుకుంది.రాజ్ అండ్ డీకే దర్శకులు కావడంతో ఇంకో బ్రేక్ దక్కుతుందని ఎదురు చూస్తోంది. అయితే ఇదే పాత్రని ప్రియాంకా చోప్రా చేసిన ఒరిజినల్ వెర్షన్ తొలి రెండు ఎపిసోడ్లకు అమెజాన్ ప్రైమ్ లో ఆశించిన స్పందన రాకపోవడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. శాకుంతలం గట్టి దెబ్బ కొట్టడంతో ఆ షాక్ నుంచి బయట పడాలంటే సిటాడెల్ సక్సెస్ కావడం చాలా కీలకం. ఈ మధ్య యాక్టివ్ గా ఉండటం బాగా తగ్గించేసిన అనుష్క శర్మ కూడా ఇకపై నటిగా నిర్మాతగా బాగా బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.
This post was last modified on May 4, 2023 12:08 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…