నిజ జీవిత అనధికార జంటగా చెలామణి అవుతున్న నరేష్ పవిత్ర హీరో హీరోయిన్లుగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న మళ్ళీ పెళ్లి ఈ నెల 26 విడుదల కాబోతోంది. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఆ డేట్ అంత రిస్క్ లేనిదైతే కాదు. ఎందుకంటే అదే రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్ తర్వాత ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అనుష్క ఫ్యాన్స్ ఎలాగూ ఫస్ట్ డే చూసేస్తారు. జాతిరత్నాలుతో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి అంతకన్నా ఎక్కువే లాగుతాడు.
సో మళ్ళీ పెళ్లికి మొదటి థ్రెట్ ఇదే అవుతుంది. కమెడియన్లు హీరోలుగా నటించిన సినిమాలు ఆడిన దాఖలాలున్నాయి కానీ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు మెయిన్ లీడ్ గా చేసి సక్సెస్ అయిన చిత్రాలు పెద్దగా కనిపించవు. కానీ దీనికి మాత్రం ఓటిటి డీల్స్ తో కలిపి తనే నిర్మాతైన నరేష్ కు టేబుల్ ప్రాఫిట్స్ తెస్తోందని ఇన్ సైడ్ టాక్. బాగా వివాదాల్లో నలిగిన జంట కావడం, రియల్ లైఫ్ జరిగిన సంఘటనలనే తెరమీద పాత్రల రూపంలో చూపించడంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది. ప్రమోషన్లు కూడా వెరైటీగా చేస్తున్నారు
ఇక్కడితో కథ అయిపోలేదు. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన రుద్రాంగి, సిద్దార్థ్ టక్కర్, మూడు హిందీ నాలుగు హాలీవుడ్ సినిమాలు మే 26నే విడుదల కాబోతున్నాయి. అయిదు రోజులు తిరక్కుండానే సూపర్ స్టార్ కృష్ణ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మోసగాళ్లకు మోసగాడు ఫోర్ కెలో 31న రాబోతోంది. ఇంత కాంపిటీషన్ పెట్టుకుని మళ్ళీ పెళ్లిని బరిలో దింపడం సాహసమే. ఏమో గుర్రం ఎగరావచ్చు సామెత తరహాలో ఇదే ఊహించినని షాక్ ఇస్తుందేమో. ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలిగి దర్శకుడిగా గత రెండేళ్లుగా బి గ్రేడ్ కంటెంట్ తీస్తున్న ఎంఎస్ రాజు దీంతో ఏమైనా రూటు మార్చారేమో చూడాలి.
This post was last modified on May 3, 2023 11:57 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…