నిజ జీవిత అనధికార జంటగా చెలామణి అవుతున్న నరేష్ పవిత్ర హీరో హీరోయిన్లుగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న మళ్ళీ పెళ్లి ఈ నెల 26 విడుదల కాబోతోంది. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఆ డేట్ అంత రిస్క్ లేనిదైతే కాదు. ఎందుకంటే అదే రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్ తర్వాత ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అనుష్క ఫ్యాన్స్ ఎలాగూ ఫస్ట్ డే చూసేస్తారు. జాతిరత్నాలుతో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి అంతకన్నా ఎక్కువే లాగుతాడు.
సో మళ్ళీ పెళ్లికి మొదటి థ్రెట్ ఇదే అవుతుంది. కమెడియన్లు హీరోలుగా నటించిన సినిమాలు ఆడిన దాఖలాలున్నాయి కానీ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు మెయిన్ లీడ్ గా చేసి సక్సెస్ అయిన చిత్రాలు పెద్దగా కనిపించవు. కానీ దీనికి మాత్రం ఓటిటి డీల్స్ తో కలిపి తనే నిర్మాతైన నరేష్ కు టేబుల్ ప్రాఫిట్స్ తెస్తోందని ఇన్ సైడ్ టాక్. బాగా వివాదాల్లో నలిగిన జంట కావడం, రియల్ లైఫ్ జరిగిన సంఘటనలనే తెరమీద పాత్రల రూపంలో చూపించడంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది. ప్రమోషన్లు కూడా వెరైటీగా చేస్తున్నారు
ఇక్కడితో కథ అయిపోలేదు. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన రుద్రాంగి, సిద్దార్థ్ టక్కర్, మూడు హిందీ నాలుగు హాలీవుడ్ సినిమాలు మే 26నే విడుదల కాబోతున్నాయి. అయిదు రోజులు తిరక్కుండానే సూపర్ స్టార్ కృష్ణ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మోసగాళ్లకు మోసగాడు ఫోర్ కెలో 31న రాబోతోంది. ఇంత కాంపిటీషన్ పెట్టుకుని మళ్ళీ పెళ్లిని బరిలో దింపడం సాహసమే. ఏమో గుర్రం ఎగరావచ్చు సామెత తరహాలో ఇదే ఊహించినని షాక్ ఇస్తుందేమో. ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలిగి దర్శకుడిగా గత రెండేళ్లుగా బి గ్రేడ్ కంటెంట్ తీస్తున్న ఎంఎస్ రాజు దీంతో ఏమైనా రూటు మార్చారేమో చూడాలి.
This post was last modified on May 3, 2023 11:57 pm
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…