ఒక సినిమా హిట్టయితే హీరోల సంతోషమే వేరు. అదే ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ అయితే మాత్రం ఏ హీరో అయినా ఆ రిజల్ట్ ను మర్చిపోయి కొలుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. తాజాగా అఖిల్ కి ఇదే పరిస్థితి ఎదురైంది. రెండేళ్ళు కష్టపడి చేసిన ‘ఏజెంట్’ డిజాస్టర్ అనిపించుకుంది. స్పై యాక్షన్ మూవీగా వచ్చిన ఏజెంట్ తో అఖిల్ మూవీ లవర్స్ తో పాటు ఫ్యాన్స్ ను కూడా నిరాశ పరిచాడు. దీంతో సినిమా మ్యాట్నీ నుండే చతికల పడింది.
మొదటి రోజు వచ్చిన రిజల్ట్ తో ఏజెంట్ ట్రోలర్స్ కి ఫుల్లు గా దొరికేసింది. ఎలాంటి లాజిక్స్ లేకుండా ఈ స్పై మూవీ ను తీసిన సురేందర్ రెడ్డి ను ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అక్కినేని ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అఖిల్ కి సపోర్ట్ గా అమల రంగంలో దిగి ట్రోల్ చేయాల్సిన సినిమా కాదని చెప్పాల్సి వచ్చింది. ఇదంతా అఖిల్ ను బాగా డిస్టర్బ్ చేసింది.
అఖిల్ కి ఫెయిల్యూర్ అనేది కొత్త కాదు. ఇప్పటి వరకూ అక్కినేని యంగ్ హీరోకి సరైన హిట్ లేదు. కానీ ఏజెంట్ విషయం వేరు. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు అఖిల్. కండలు పెంచి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ పడుతుందని గట్టిగా నమ్మాడు. కానీ ఏజెంట్ అఖిల్ ఆశలపై నీళ్ళు చల్లింది. దీంతో ఏజెంట్ డిజాస్టర్ నుండి త్వరగా బయటికొచ్చేందుకు దుబాయి వెళ్ళిపోయాడు. అక్కడే కొన్ని రోజుల పాటు గడిపి తర్వాత ఇండియా రానున్నాడు. వచ్చాక అఖిల్ నెక్స్ట్ సినిమాకు సంబందించి ప్రకటన ఉంటుంది. యూవీ క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా ఉండబోతుంది.
This post was last modified on May 2, 2023 10:51 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…