విడుదలైన రెండు మూడు రోజులు తిరక్కుండానే విపరీతమైన చర్చలకు దారి తీసిన ఏజెంట్ ఫలితం నిర్మాత అనిల్ సుంకర స్టేట్ మెంట్ తో కొత్త మలుపు తిరగడం ఆ తర్వాత పరిణామాలు చూస్తూనే ఉన్నాం. అఖిల్ చల్లగా దుబాయ్ వెళ్ళిపోయాడు. ఎంత డిజాస్టర్ అయినా కనీసం ఫస్ట్ వీక్ ఫుల్ కోసం చేసే ప్రమోషన్లు కూడా దీనికి చేయలేదు. అభిమానుల విమర్శలతో ట్విట్టర్ వేదికగా దర్శకుడు సురేందర్ రెడ్డి తడిసి ముద్దవుతున్నారు. హీరోయిన్ సాక్షి వైద్య, విలన్ డినో మోరియా, ప్రధాన పాత్ర పోషించిన మమ్ముట్టి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. మొత్తం వాష్ ఔటే.
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఏజెంట్ ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోతోంది. మే 19న సోనీ లివ్ లో తెలుగు తమిళ మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కానీ డేట్ అయితే లాక్ చేశారు. ఏ క్షణమైనా అనౌన్స్ మెంట్ రావొచ్చు. భారీ రేటుకి హక్కులను సొంతం చేసుకున్న సోనీ నిజానికి దీని మీద చాలా ఆశలు పెట్టుకుంది. ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లాంటివి పోటీ పడినా సరే ఏదోలా చేజిక్కించుకుంది. అయితే థియేటర్లలో ఏజెంట్ చూసినవాళ్లు తక్కువ కాబట్టి వ్యూస్ పరంగా నమ్మకం పెట్టుకోవచ్చు.
సరిగ్గా ఇరవై రోజులకే అఖిల్ డిజిటల్ స్క్రీన్ మీదకు వచ్చేస్తున్నాడు. గత ఏడాది సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలన్న నిబంధన ఎవరూ పాటించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే రావణాసుర ఇప్పుడు ఏజెంట్ అదే దారి పడుతున్నాయి. ఇకపై ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ ఓటిటి కండీషన్ గురించి మాత్రం ఎవరూ నోరు విప్పేలా లేరు. అయినా విపరీత నష్టాల నుంచి అంతో ఇంతో బయటపడేస్తోంది ఈ డిజిటల్ డీల్సే. సో ఆపడం అడ్డుకోవడం భవిష్యత్తులో జరగని పని.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…