వనిత విజయ్ కుమార్.. సినిమాలు, సినీ రంగానికి సంబంధించిన విషయాలను ఫాలో అయ్యే వారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తమిళ సీనియర్ నటీనటులు విజయ్ కుమార్, మంజులల తనయురాలైన ఈ అమ్మాయి ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది.
తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలు.. ఇతర వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి కూడా పెద్ద వివాదానికే దారి తీసింది. ఇంత గొడవ తర్వాత చివరికి పీటర్తోనూ ఆమె ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఏడాది తిరిగేసరికి పీటర్ నుంచి విడిపోయింది వనిత. అప్పట్నుంచి వార్తల్లో లేని పీటర్ పేరు.. ఇప్పుడు మరణ వార్తతో మీడియాలోకి వచ్చింది.
తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పీటర్ పాల్ చనిపోయాడు. పీటర్ వయసు 39 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. తాగుడుకు బానిస కావడం వల్లే పీటర్ చనిపోయాడని అంటున్నారు. వనితతో పెళ్లి తర్వాత ఇద్దరికీ ఈ విషయంలోనే గొడవలు తలెత్తాయి. రోజూ తాగకుండా ఉండలేని బలహీనతతో పీటర్ పూర్తిగా దారి తప్పాడని.. తాగి తనను కొట్టేవాడని ఆమె మీడియా ముందు చెప్పింది. తాగుడు వల్ల కాలేయం దెబ్బ తిని ఆసుపత్రి పాలయ్యాడట పీటర్. కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్న అతను.. తాజాగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సందర్భంగా వనిత సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. పీటర్ తాగుడు గురించి పరోక్షంగా ఆమె అందులో పరోక్షంగా ప్రస్తావించింది కూడా. ఇప్పుడు వెళ్తున్న కొత్త చోట అయినా ప్రశాంతంగా బతకాలని పేర్కొంటూ నువ్వుకెక్కడున్నా నీ మంచినే కోరుకుంటా అని వనిత పేర్కొంది. తమిళంలో బిగ్ బాస్ షోతో పాటు సీరియళ్లలోనూ మెరిసిన వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటిస్తుండటం గమనార్హం.
This post was last modified on May 1, 2023 1:31 pm
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…