వనిత విజయ్ కుమార్.. సినిమాలు, సినీ రంగానికి సంబంధించిన విషయాలను ఫాలో అయ్యే వారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తమిళ సీనియర్ నటీనటులు విజయ్ కుమార్, మంజులల తనయురాలైన ఈ అమ్మాయి ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది.
తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలు.. ఇతర వ్యవహారాలతో ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి కూడా పెద్ద వివాదానికే దారి తీసింది. ఇంత గొడవ తర్వాత చివరికి పీటర్తోనూ ఆమె ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఏడాది తిరిగేసరికి పీటర్ నుంచి విడిపోయింది వనిత. అప్పట్నుంచి వార్తల్లో లేని పీటర్ పేరు.. ఇప్పుడు మరణ వార్తతో మీడియాలోకి వచ్చింది.
తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పీటర్ పాల్ చనిపోయాడు. పీటర్ వయసు 39 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. తాగుడుకు బానిస కావడం వల్లే పీటర్ చనిపోయాడని అంటున్నారు. వనితతో పెళ్లి తర్వాత ఇద్దరికీ ఈ విషయంలోనే గొడవలు తలెత్తాయి. రోజూ తాగకుండా ఉండలేని బలహీనతతో పీటర్ పూర్తిగా దారి తప్పాడని.. తాగి తనను కొట్టేవాడని ఆమె మీడియా ముందు చెప్పింది. తాగుడు వల్ల కాలేయం దెబ్బ తిని ఆసుపత్రి పాలయ్యాడట పీటర్. కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్న అతను.. తాజాగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సందర్భంగా వనిత సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. పీటర్ తాగుడు గురించి పరోక్షంగా ఆమె అందులో పరోక్షంగా ప్రస్తావించింది కూడా. ఇప్పుడు వెళ్తున్న కొత్త చోట అయినా ప్రశాంతంగా బతకాలని పేర్కొంటూ నువ్వుకెక్కడున్నా నీ మంచినే కోరుకుంటా అని వనిత పేర్కొంది. తమిళంలో బిగ్ బాస్ షోతో పాటు సీరియళ్లలోనూ మెరిసిన వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటిస్తుండటం గమనార్హం.
This post was last modified on May 1, 2023 1:31 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…