Virupakasha
సాయి తేజ్ ధరమ్ కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్న విరూపాక్ష నిన్న మొన్న వీకెండ్ ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కొత్త రిలీజులు ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 కంటే దీనికే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. చాలా చోట్ల అఖిల్ సినిమాని తీసేసి అప్పటికప్పుడు విరూపాక్ష వేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల దాదాపు హౌస్ ఫుల్స్ పడిపోవడం ఈ హారర్ మూవీ జనంలోకి ఎంతగా రీచ్ అయ్యిందో తేటతెల్లం చేస్తోంది. రామబాణం, ఉగ్రంలు వచ్చేదాకా తేజుకు బ్రేకులు వేయడం కష్టం కాదు అసాధ్యం.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు విరూపాక్ష పది రోజులకుగాను 53 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. షేర్ లెక్కలో 30 కోట్ల 35 లక్షల దాకా తేలుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ మసాలాలు లేని ఒక చిత్రానికి ఇంత మొత్తం రావడమంటే అదో అద్భుతమే. మీడియం బడ్జెట్ సినిమాల్లో పదో రోజు అత్యధికంగా కలెక్ట్ చేసిన వాటిలో ఉప్పెన 2 కోట్ల 60 లక్షలలో మొదటి స్థానంలో ఉండగా విరూపాక్ష 2 కోట్ల 40 లక్షలతో సెకండ్ ప్లేస్ తీసుకుంది. ఒకవేళ ఐపీఎల్ మ్యాచులు, తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న భారీ వర్షాలు లేకపోతే మూడు కోట్లకు దగ్గరగా వెళ్ళేది
ఈ ఉత్సాహంతోనే హిందీ తమిళ వెర్షన్లు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్లో మే 5 గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం చేశారు. తమిళంలో 12న ఉంటుంది. కన్నడ మలయాళం డేట్లు ఒకటి రెండు రోజుల్లో డిసైడ్ చేస్తారు. అక్కడా ఇదే టాక్ తెచ్చుకుంటే మాత్రం అన్ని భాషలకు కలిపి వచ్చే ఫైనల్ ఫిగర్స్ షాకింగ్ గా ఉండటం ఖాయం. రాబోయే రోజుల్లో భారీగా చెప్పుకునే పోటీ లేదు. నాని దసరాలాగే కనీసం నెల పాటు నాన్ స్టాప్ రన్ ఖాయంగానే అనిపిస్తోంది. ఒకవేళ కస్టడీకి అదిరిపోయే టాక్ వస్తే అప్పుడు నెమ్మదిస్తుందేమో కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన టెన్షన్ అయితే ఏమి లేదు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…