‘నాంది’ సినిమాతో ఇటు ప్రేక్షకులను, అటు ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరిచాడు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల. తొలి సినిమాకు సామాజిక అంశాలతో కూడిన ఒక సీరియస్ కథను ఎంచుకుని.. దాన్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్ది మంచి విజయాన్నందుకున్నాడు విజయ్.
అతడి రెండో సినిమా ఒక స్టార్ హీరోతో ఉండొచ్చని ప్రచారం జరిగింది. అక్కినేని నాగచైతన్యతో సినిమా కోసం కథా చర్చలు కూడా జరిపాడు విజయ్. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తన తొలి చిత్ర కథానాయకుడు అల్లరి నరేష్తోనే ‘ఉగ్రం’ తీశాడు.
ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలతో పాటు నాగచైతన్యతో అనుకున్న సినిమా గురించి కూడా మీడియాతో మాట్లాడాడు విజయ్. చైతూ కోసం అనుకున్న కథ 80 శాతం ఓకే అయినా.. క్లైమాక్స్ విషయంలో సంతృప్తి చెందక ఆ సినిమా ఆగిందన్నాడు విజయ్.
‘‘నాంది తర్వాత నాగచైతన్యతో సినిమా చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే. నేను తయారు చేసిన కథ ఆయనకు నచ్చింది. 80 శాతం వరకు ఓకే అన్నారు. కానీ పతాక సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు. అలా అని ఆ కథను పక్కన పెట్టలేదు. దాని మీద పని చేస్తున్నాం. మార్పులు చేర్పులు చేస్తున్నాం. మిగతా కథతోనే మెప్పించి చైతూతో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నా. ‘ఉగ్రం’ సినిమా విషయానికి వస్తే.. ఇది ‘నాంది’ చేస్తుండగా.. లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్లో తయారు చేసిన కథ. వాస్తవ ఘటనలు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. ఇందుకోసం చాలామంది పోలీస్ అధికారులను కలిశాం. ఆరు నెలలు పరిశోధన జరిపాం. ‘నాంది’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కింది. ఆ స్థాయి ఉన్న కథ ఇది. ఇందులో నరేష్ను చూసి ప్రేక్షకులు షాకవుతారు. మరోసారి మేమిద్దరం కలిసి హిట్ కొడతాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు విజయ్.
This post was last modified on April 30, 2023 9:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…