‘నాంది’ సినిమాతో ఇటు ప్రేక్షకులను, అటు ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరిచాడు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల. తొలి సినిమాకు సామాజిక అంశాలతో కూడిన ఒక సీరియస్ కథను ఎంచుకుని.. దాన్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్ది మంచి విజయాన్నందుకున్నాడు విజయ్.
అతడి రెండో సినిమా ఒక స్టార్ హీరోతో ఉండొచ్చని ప్రచారం జరిగింది. అక్కినేని నాగచైతన్యతో సినిమా కోసం కథా చర్చలు కూడా జరిపాడు విజయ్. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తన తొలి చిత్ర కథానాయకుడు అల్లరి నరేష్తోనే ‘ఉగ్రం’ తీశాడు.
ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలతో పాటు నాగచైతన్యతో అనుకున్న సినిమా గురించి కూడా మీడియాతో మాట్లాడాడు విజయ్. చైతూ కోసం అనుకున్న కథ 80 శాతం ఓకే అయినా.. క్లైమాక్స్ విషయంలో సంతృప్తి చెందక ఆ సినిమా ఆగిందన్నాడు విజయ్.
‘‘నాంది తర్వాత నాగచైతన్యతో సినిమా చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే. నేను తయారు చేసిన కథ ఆయనకు నచ్చింది. 80 శాతం వరకు ఓకే అన్నారు. కానీ పతాక సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు. అలా అని ఆ కథను పక్కన పెట్టలేదు. దాని మీద పని చేస్తున్నాం. మార్పులు చేర్పులు చేస్తున్నాం. మిగతా కథతోనే మెప్పించి చైతూతో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నా. ‘ఉగ్రం’ సినిమా విషయానికి వస్తే.. ఇది ‘నాంది’ చేస్తుండగా.. లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్లో తయారు చేసిన కథ. వాస్తవ ఘటనలు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. ఇందుకోసం చాలామంది పోలీస్ అధికారులను కలిశాం. ఆరు నెలలు పరిశోధన జరిపాం. ‘నాంది’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కింది. ఆ స్థాయి ఉన్న కథ ఇది. ఇందులో నరేష్ను చూసి ప్రేక్షకులు షాకవుతారు. మరోసారి మేమిద్దరం కలిసి హిట్ కొడతాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు విజయ్.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…