‘నాంది’ సినిమాతో ఇటు ప్రేక్షకులను, అటు ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరిచాడు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల. తొలి సినిమాకు సామాజిక అంశాలతో కూడిన ఒక సీరియస్ కథను ఎంచుకుని.. దాన్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్ది మంచి విజయాన్నందుకున్నాడు విజయ్.
అతడి రెండో సినిమా ఒక స్టార్ హీరోతో ఉండొచ్చని ప్రచారం జరిగింది. అక్కినేని నాగచైతన్యతో సినిమా కోసం కథా చర్చలు కూడా జరిపాడు విజయ్. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తన తొలి చిత్ర కథానాయకుడు అల్లరి నరేష్తోనే ‘ఉగ్రం’ తీశాడు.
ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలతో పాటు నాగచైతన్యతో అనుకున్న సినిమా గురించి కూడా మీడియాతో మాట్లాడాడు విజయ్. చైతూ కోసం అనుకున్న కథ 80 శాతం ఓకే అయినా.. క్లైమాక్స్ విషయంలో సంతృప్తి చెందక ఆ సినిమా ఆగిందన్నాడు విజయ్.
‘‘నాంది తర్వాత నాగచైతన్యతో సినిమా చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే. నేను తయారు చేసిన కథ ఆయనకు నచ్చింది. 80 శాతం వరకు ఓకే అన్నారు. కానీ పతాక సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు. అలా అని ఆ కథను పక్కన పెట్టలేదు. దాని మీద పని చేస్తున్నాం. మార్పులు చేర్పులు చేస్తున్నాం. మిగతా కథతోనే మెప్పించి చైతూతో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నా. ‘ఉగ్రం’ సినిమా విషయానికి వస్తే.. ఇది ‘నాంది’ చేస్తుండగా.. లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్లో తయారు చేసిన కథ. వాస్తవ ఘటనలు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. ఇందుకోసం చాలామంది పోలీస్ అధికారులను కలిశాం. ఆరు నెలలు పరిశోధన జరిపాం. ‘నాంది’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కింది. ఆ స్థాయి ఉన్న కథ ఇది. ఇందులో నరేష్ను చూసి ప్రేక్షకులు షాకవుతారు. మరోసారి మేమిద్దరం కలిసి హిట్ కొడతాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు విజయ్.
This post was last modified on April 30, 2023 9:48 pm
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…