త్రివిక్రమ్ సినిమా కథలనే అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ చెబుతున్నాడని ఎంత ట్రోలింగ్ జరిగినా కానీ వాటికి వందల కోట్లు వసూలు చేసే సత్తా ఉందని అల వైకుంఠపురంలో నిరూపించింది. తదుపరి చిత్రాన్ని తారక్ తో ఓకే చేసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం ఆ సినిమా కథ మీదే కసరత్తు చేస్తున్నాడు.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఇరవై కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద స్టార్ హీరోలకు తీసిపోని ఇమేజ్ ఉంది కనుక త్రివిక్రమ్ కి ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఉండొచ్చు. అయితే కరోనా తర్వాత మార్కెట్ లెక్కలు మారతాయని భావిస్తున్నారు. అప్పుడు మరి త్రివిక్రమ్ పారితోషికంపై కూడా కోత పడుతుందో లేదో తెలీదు.
ఎన్టీఆర్ కి నలభై కోట్ల పారితోషికంతో పాటు తన సోదరుడు కళ్యాణ్ రామ్ కి నిర్మాతగా వాటా ఇచ్చారు. కరోనా విపత్తు ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నిటినీ సవరించుకుని బడ్జెట్ తిరిగి వేస్తారో లేక ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి అంత మామూలైపోయి ఇదే బడ్జెట్ కి ఫిక్స్ అవుతారో వేచి చూడాలి.
This post was last modified on August 5, 2020 12:41 am
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…