త్రివిక్రమ్ సినిమా కథలనే అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ చెబుతున్నాడని ఎంత ట్రోలింగ్ జరిగినా కానీ వాటికి వందల కోట్లు వసూలు చేసే సత్తా ఉందని అల వైకుంఠపురంలో నిరూపించింది. తదుపరి చిత్రాన్ని తారక్ తో ఓకే చేసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం ఆ సినిమా కథ మీదే కసరత్తు చేస్తున్నాడు.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఇరవై కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద స్టార్ హీరోలకు తీసిపోని ఇమేజ్ ఉంది కనుక త్రివిక్రమ్ కి ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఉండొచ్చు. అయితే కరోనా తర్వాత మార్కెట్ లెక్కలు మారతాయని భావిస్తున్నారు. అప్పుడు మరి త్రివిక్రమ్ పారితోషికంపై కూడా కోత పడుతుందో లేదో తెలీదు.
ఎన్టీఆర్ కి నలభై కోట్ల పారితోషికంతో పాటు తన సోదరుడు కళ్యాణ్ రామ్ కి నిర్మాతగా వాటా ఇచ్చారు. కరోనా విపత్తు ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నిటినీ సవరించుకుని బడ్జెట్ తిరిగి వేస్తారో లేక ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి అంత మామూలైపోయి ఇదే బడ్జెట్ కి ఫిక్స్ అవుతారో వేచి చూడాలి.
This post was last modified on August 5, 2020 12:41 am
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…