‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో రాజమౌళి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. సినీ రంగంలోనే కాదు.. అనేక రంగాల్లో రాజమౌళికి అపారమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వివిధ రంగాల ప్రముఖులు కూడా జక్కన్నకు అభిమానులుగా మారిపోయారు. అందులో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. రాజమౌళి మీద గతంలోనూ ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఆయన జక్కన్నకు ఒక సినిమా తీయాలనే సూచన చేయడం విశేషం. అందుకు రాజమౌళి కూడా స్పందించాడు. ఇదంతా ట్విట్టర్లో జరిగిన సంభాషణ కావడం గమనార్హం.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా.. తాజాగా సింధు నాగరికతకు సంబంధించిన ఒక ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. “ఇలాంటి ఫొటోలు మన చరిత్రకు జీవం పోస్తాయి. మన ప్రతిభను ప్రతిబింబిస్తాయి. నాటి పరిస్థితులు ప్రపంచానికి తెలిసేలా వీటిపై ఒక సినిమా తీయగలరా” అని రాజమౌళిని ట్యాగ్ చేసి అడిగారు ఆనంద్ మహీంద్రా. దీనికి వెంటనే జక్కన్న స్పందించాడు. ‘మగధీర’ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.
“మేం మగధీర సినిమా షూటింగ్ ధోలావీరాలో చేశఆం. ఆ సమయంలో అక్కడున్న ఒక చెట్టు నన్నెంతో ఆకర్షించింది. దాని ఆధారంగా సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందింది.. ఎలా అంతరించింది అని చూపిస్తూ ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్కు వెళ్లాను. అక్కడ మొహెంజదారోకు వెళ్లి పరిశోధన చేయాలని ప్రయత్నించా. కానీ అనుమతులు రాలేదు” అని రాజమౌళి వెల్లడించారు. మరి ఆనంద్ మహీంద్రా ఏమైనా పూనుకుని ఈ విషయంలో రాజమౌళికి సాయం చేసి.. తన పరిశోధన పూర్తి చేసేలా చేస్తారా.. నిజంగానే భవిష్యత్తులో సింధు నాగరికత మీద జక్కన్న సినిమా తీస్తాడా అన్నది చూడాలి. ఐతే మొహెంజదారో సంస్కృతి మీద బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ సినిమా తీస్తే అది చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం మరువరాదు.
This post was last modified on April 30, 2023 8:36 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…