Movie News

30 కోట్లు ఖర్చుపెట్టాక ఆపేసిన మల్టీస్టారర్

బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న మల్టీ స్టారర్ ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ గురించిన వార్తలు గత రెండు మూడు వారాలుగా గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. 2019లో వచ్చిన ఉరి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు ఆదిత్య ధార్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మీదే అయిదేళ్ళుగా పని చేస్తున్నాడు. దీని ముందు వెనుకా చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. ఇది ప్రకటించినప్పుడు హీరో హీరోయిన్లుగా విక్కీ కౌశల్, సారా అలీఖాన్లను తీసుకున్నారు. కానీ కరోనా టైంలో ఆపేయాల్సి వచ్చింది. కొంతకాలం అయ్యాక సారా కన్నా సమంతా మంచి ఛాయస్ అనిపించి తనను సంప్రదించారు.

ఈలోగా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాత రోనీ స్క్రూవాలా దీన్నుంచి తప్పుకున్నారు. ఆదిత్య ధార్ చాలా మంది నిర్మాతలను కలిసి ఎట్టకేలకు జియో సంస్థ కోసం ముఖేష్ అంబానీ టీమ్ ని ఒప్పించాడు. అయితే విక్కీ కౌశల్ కు అంత మార్కెట్ లేదని గుర్తించిన జియో అతన్ని మార్చాలని నిర్ణయించుకుంది. ఇది ఎంతకీ తేలకపోవడంతో సామ్ తప్పుకుంది. స్టార్ వేల్యూ కావాలనే ఉద్దేశంతో ఆదిత్య కెజిఎఫ్ యష్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ లను సంప్రదించాడు. అయితే ఇద్దరూ అంత సుముఖంగా లేరట.

సరే రన్వీర్ సింగ్ ని ప్రయత్నిద్దామని ఒక రాయి వేశారు. కానీ అప్పటికే అతను ఇలాంటి సూపర్ హీరో సబ్జెక్టుతో శక్తిమాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. దీంతో నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఇలా పలు దఫాల చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం పెట్టిన ఖర్చు అక్షరాలా 30 కోట్లకు పైమాటే. సినిమాకు కావాల్సిన బడ్జెట్ 350 కోట్లు. రిస్క్ చేసి మొత్తం పోగొట్టుకోవడం కన్నా పది శాతం నష్టంతో గట్టెక్కడం మంచిదనే ఆలోచనతో ఇప్పుడు జియో కూడా దాదాపు డ్రాప్ అయినట్టేనట. ఆదిత్య ధార్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఇంకా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు

This post was last modified on May 1, 2023 4:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

5 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

11 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

14 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

16 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

16 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

17 hours ago