Movie News

‘ఓటీటీ’ ఆంక్షలు ఏమయ్యాయబ్బా?

గత ఏడాది టాలీవుడ్లో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం.. అలాగే ఓటీటీల ప్రభావం వల్ల సినీ పరిశ్రమ కుదేలవుతోందంటూ దిల్ రాజు సహా అగ్ర నిర్మాతలంతా కలిసి షూటింగ్స్ ఆపి.. నెల రోజుల పాటు చర్చోప చర్చలు జరిపి అనేక తీర్మానాలు జరిపారు. అందులో భాగంగా చిన్న సినిమాలకు కనీసం నెల రోజులు.. మిడ్ రేంజ్, పెద్ద సినిమాలు కనీసం 50 రోజుల తర్వాతే డిజిటల్‌గా రిలీజయ్యేలా చూడాలని.. దీన్ని అందరూ గట్టిగా పాటించి తీరాలని తీర్మానించారు.

అందులో భాగంగా మొదట్లో కొన్ని సినిమాలు ఈ విరామాన్ని పాటించాయి. పేరున్న సినిమాలు కొన్ని నెల రోజుల పాటు ఆగి తర్వాత ఓటీటీల్లోకి వచ్చాయి. కానీ ఈ ఆంక్షలు, స్వీయ నియంత్రణలు ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ రెండు మూడు వారాలకే కొత్త సినిమాలు ఓటీటీల్లోకి రావడం మొదలైంది. మొదట్లో ఇదేంటి ఇలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోయారు. తర్వాత అందరూ అలవాటు పడిపోయారు.

ఈ నెల ఏడో తారీఖున రవితేజ సినిమా ‘రావణాసుర’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం మూడు వారాలు తిరక్కముందే, ఇదే నెలలో ఓటీటీలోకి దిగేసింది. ‘రావణాసుర’ ఫ్లాప్ మూవీనే కావచ్చు. కానీ అంత పెద్ద హీరో సినిమా మూడు వారాలకే ఓటీటీలో రిలీజైతే ప్రేక్షకుల ఆలోచన ఎలా ఉంటుంది? సినిమా సరిగా ఆడలేదని ముందే ఓటీటీలోకి తెచ్చారని అనుకోలేం. ఈ డీల్ రిలీజ్‌కు ముందే ఫిక్సయి ఉంటుంది. అంటే సినిమా థియేటర్లలో బాగా ఆడి ఉన్నా మూడు వారాలకే ఓటీటీలో రిలీజయ్యేదన్నమాట.

గత నెలలో దిల్ రాజు సినిమా ‘బలగం’ ఇలాగే థియేటర్లలో మంచి వసూళ్లతో సాగుతుండగానే డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ విషయం తెలియక హీరో ప్రియదర్శి సైతం ఓటీటీ రిలీజ్ ఇప్పుడే లేదంటే లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు సోషల్ మీడియాలో. దిల్ రాజు, అభిషేక్ నామా లాంటి పేరున్న నిర్మాతలే తమకు తాము పెట్టుకున్న షరతులను మీరితే.. ఇక మిగతా ప్రొడ్యూసర్లు ఎందుకు ఆగుతారు?

This post was last modified on April 29, 2023 1:26 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

13 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

14 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

14 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

15 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

16 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

17 hours ago