తమిళంలో దర్శకుడు వెట్రిమారన్ కున్న పేరు తెలిసిందే. కేవలం ఈ బ్రాండ్ మీదే తెలుగులో విడుదల పార్ట్ 1ని మార్కెటింగ్ చేశారు. కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈయన రచనలో రాజ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీస్ జల్లికట్టు నిన్నటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అరవింద్ బృందం ఇందులోని ప్రారంభ ఎపిసోడ్లను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఫ్యాన్స్ ప్రీమియర్ వేశారు. దీన్ని బట్టే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇది మెప్పించేలా సాగిందా.
ఆవులను నమ్ముకుని వాటి మీద బ్రతికే వెనుకబడిన జాతికి చెందిన ముత్తయ్య(కిషోర్)కు చేదోడువాదోడుగా మేనల్లుడు పాండు (కలైయారసన్)ఉంటాడు. వీళ్ళ కులాన్ని తక్కువగా చూసే తామర వర్గానికి చెందిన జమిందార్ సెల్వశేఖర్(వేల రాంమూర్తి) ఎద్దుని జల్లికట్టులో పాండు పట్టుకుని గెలుస్తాడు. ఆ మూగజీవం బావిలో పడి చనిపోతుంది. ఇది అవమానంగా భావించిన సెల్వ అనుచరులు పాండుని హత్య చేస్తారు. ఇక్కడి నుంచి పగలు ప్రతీకారాలు తిరిగి మొదలవుతాయి. పాండు మరణం రెండూళ్ల మధ్య చిచ్చు రేపుతుంది. అసలైన కథ ఇక్కడి నుంచే చూడాలి.
ఎప్పుడూ అణిచివేత తిరుగుబాటుని బ్యాక్ డ్రాప్ గా తీసుకునే వెట్రిమారన్ ఈ జల్లికట్టులోనూ అదే చేశారు. పేరుకి రాజ్ కుమార్ దర్శకుడైనా ప్రతి ఫ్రేమ్ లో అతని గురువు ముద్ర కనిపిస్తుంది. సిరీస్ కావడంతో అవసరానికి మించిన ల్యాగ్ మధ్యలో వచ్చినప్పటికీ నారప్ప, ధనుష్ కర్ణన్ తరహా నేపధ్యాన్ని ఇష్టపడేవాళ్ళకు జల్లికట్టు ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తుంది కానీ మిగిలినవాళ్లు ఫార్వార్డ్ చేయకుండా చూడటం కష్టం. ఆర్టిస్టులు బాగా కుదిరారు. ఇదే బ్యాక్ డ్రాప్ లో స్టార్ హీరో సూర్యతో వడివాసల్ తీస్తున్న వెట్రిమారన్ అందులో ఎలాంటి వైవిధ్యం చూపిస్తారో.
This post was last modified on April 27, 2023 2:01 pm
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడంలోనే అసలైన గౌరవం, మర్యాద ఉంటాయని మరోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…